టాపార్డర్లో..
దాంతో ఈ సీజన్ వేలంలోకి వచ్చిన స్టీవ్ స్మిత్ను ఆశ్చర్యకరంగా ఢిల్లీ క్యాపిటల్స్ అతని కనీస ధర రూ.2 కోట్లకు మరో 20 లక్షలు ఎక్కువగా చెల్లించి(రూ.2.2 కోట్లు) సొంతం చేసుకుంది. అతని కోసం ఆరంభంలో ఆర్సీబీ పోటి పడినా చివర్లో తప్పుకుంది. దాంతో స్మిత్ తక్కువ ధరకే ఢిల్లీకి సొంతమయ్యాడు. ఈ నేపథ్యంలో తాజాగా క్రికెట్ ఆస్ట్రేలియా అధికారిక వెబ్సైట్ క్రికెట్.కామ్ ఏయూతో మాట్లాడిన పాంటింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తుది జట్టులో అతను టాప్-3లో ఆడుతాడని, అయితే టీమ్ కాంబినేషన్స్ బట్టి అతనికి తుది జట్టులో ఎక్కువగా అవకాశాలు రాకపోవచ్చన్నాడు.
మెగా వేలం ఉంది కాబట్టి..
'ఇంత తక్కువ ధరకే మేం స్మిత్ను దక్కించుకుంటామని అనుకోలేదు. సుదీర్ఘ కాలంగా అతన్ని కొనసాగించిన ఫ్రాంఛైజీ ఈ సీజన్లో వదులుకుంది. ప్రస్తుతం అతను ఆట మీద కసితో ఉన్నాడు. ఈసారి కచ్చితంగా పరుగుల వరద పారిస్తాడు. వచ్చే ఏడాది మెగా వేలం ఉంటుందన్న సంగతి తనకు తెలుసు. కాబట్టి ఈ సీజన్లో బాగా రాణిస్తే, తనను కొనుగోలు చేసేందుకు భవిష్యత్తులో పెద్దమొత్తం ఖర్చు చేయాల్సిన అవసరం వస్తుందనే విషయం అతనికి తెలుసు.'అని పాంటింగ్ చెప్పుకొచ్చాడు.
స్మిత్ సేవలు..
ఇక వేలం జరుగుతున్న సమయంలో తాను ఇంట్లోనే ఉన్నానన్న పాంటింగ్... 'ఫ్రాంఛైజీ యజమానులతో ఆరోజు ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నాను. ఇంతలో స్మిత్ కోసం బిడ్ వేసినట్లు తెలిసింది. వెనువెంటనే డీసీ అతన్ని కొనుగోలు చేసిందనే ప్రకటన కూడా వెలువడింది. స్మిత్ అనుభవం, తన క్లాసిక్ ఆట మా జట్టుకు ప్రయోజనం చేకూరుస్తుందనే విషయంలో ఎలాంటి సందేహం లేదు'అని స్టీవ్ స్మిత్పై ఫంటర్ ప్రశంసల జల్లు కురిపించాడు.
తుది జట్టులో చోటు కష్టమే..
ప్రస్తుత టీమ్ కాంబినేషన్స్ కారణంగా స్మిత్కు ఎక్కువ అవకాశాలు వస్తాయని చెప్పలేనని రికీ పాంటింగ్ అంగీకరించాడు. ఒక వేళ అవకాశం వస్తే మాత్రం అతను టాప్-3లో బ్యాటింగ్ చేస్తాడని స్పష్టం చేశాడు. కాగా రాజస్తాన్ రాయల్స్ స్మిత్ను వదులుకున్న తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ పోటీపడగా, డీసీ అతడిని సొంతం చేసుకుంది. ఇక ఏప్రిల్ 10న తమ తొలి మ్యాచ్లో డీసీ చెన్నై సూపర్ కింగ్స్తో తలపడనుంది. రెగ్యులర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ గాయం కారణంగా దూరం కావడంతో, టీమిండియా యువ కెరటం రిషభ్ పంత్ సారథ్యంలో ముందుకు సాగనుంది.