యూఏఈలో నిర్వహిస్తే..?
గతేడాది ఐపీఎల్ను యూఏఈలో విజయవంతంగా నిర్వహించారు. మళ్లీ అక్కడికే వేదికను మారిస్తే మెరుగని మరో ఆలోచన. అక్కడి పిచ్లు, వాతావరణం, బయో బుడగ, కరోనా పరిస్థితులపై మంచి అవగాహన ఉంది. ఇంగ్లండ్ సిరీస్ ముగియగానే నేరుగా ఇంగ్లండ్, భారత ఆటగాళ్లను దుబాయ్కు తీసుకెళ్లాలన్నది యోచన. యూఏఈకి వచ్చేందుకు ఇతర దేశాల ఆటగాళ్లకూ అభ్యంతరం ఉండదని అనుకుంటున్నారు. అంతేకాకుండా లీగ్ ముగియగానే ఐసీసీ టీ20 ప్రపంచకప్ను కూడా నిర్వహించే అవకాశం ఉంది. మెగా టోర్నీ ఆతిథ్య హక్కులు కూడా భారత్ దగ్గరే ఉన్నాయి. కానీ, సెప్టెంబర్లో యూఏఈలో ఎండలు విపరీతంగా ఉంటాయి. కాకపోతే గత సీజన్ కూడా సెప్టెంబర్లోనే జరగడం సానుకూలాంశం.
ఇంగ్లండ్ కూడా మంచి ఆప్షన్..
జులైలో ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ జరగనుంది. టీమిండియా, న్యూజిలాండ్ ఇందులో తలపడనున్నాయి. టెస్టుకు కొన్ని రోజుల ముందుగానే కోహ్లీసేన అక్కడికి చేరుకోనుంది. ఫైనల్ ముుగిసిన తర్వాత ఇంగ్లండ్తో సుదీర్ఘ ఫార్మాట్లో తలపడనుంది. సిరీస్ ముగిసే సరికి సెప్టెంబర్ అవుతుంది. అందుకని అదే నెలలో ఐపీఎల్ మిగిలిన మ్యాచులు అక్కడే నిర్వహించాలన్నది ఐపీఎల్ పెద్దల మరో ఆలోచన.
ఆసీస్ కూడా బెటరే..
ఆస్ట్రేలియాలో ఐపీఎల్ నిర్వహిస్తే బాగుంటుందని మరో ఆలోచన. ప్రస్తుతం ఆ దేశంలో రాకపోకలపై కఠిన ఆంక్షలు ఉన్నాయి. బహుశా నాలుగు నెలల్లో ప్రభుత్వం వీటిని తొలగిస్తుందని అంచనా. వాస్తవంగా 2020లో టీ20 ప్రపంచకప్ను ఆసీస్లోనే నిర్వహించాల్సింది. అది వాయిదా పడటంతో 2021 కప్ను భారత్లో నిర్వహించాలని నిర్ణయించారు. 2022 హక్కులు ఆసీస్కు ఇచ్చారు. చర్చలు జరిపితే ఈ ఏడాది మెగా టోర్నీని అక్కడ నిర్వహించే వచ్చే ఏడాది భారత్లో ఆతిథ్యమిచ్చేందుకు మార్గం సుగమం కావచ్చు. క్రికెట్ ఆస్ట్రేలియాకు ఇందుకు అభ్యంతరం ఉండకపోవచ్చు. ఇదే జరిగితే పెర్త్ వేదికగా సెప్టెంబర్లో ఐపీఎల్ నిర్వహిస్తే బాగుంటందనే చర్చ కూడా జరుగుతుంది. పెర్త్ సమయం భారత కాలమానం కన్నా 3.30 గంటలు ముందుంటుంది. వీక్షణకు అనువుగా ఉంటుంది.