శుభారంభం దక్కలేదు..
ఇక 178 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీకి శుభారంభం దక్కలేదు. ఓపెనర్ ఫించ్(14) శ్రేయాస్ గోపాల్ వేసిన నాలుగో ఓవర్లో భారీ షాట్కు ప్రయత్నించి క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ మరో ఓపెనర్ పడిక్కల్తో కలిసి ఇన్నింగ్స్ ను ముందుకు నడిపించాడు. పడిక్కల్ రెండు, కోహ్లీ ఓ బౌండరీ కొట్టడంతో ఆర్సీబీ పవర్ ప్లే ముగిసే సరికి వికెట్ నష్టానికి 47 పరుగులు చేసింది. అనంతరం ఈ జోడీ క్విక్ సింగిల్స్, డబుల్స్కే పరిమితవడంతో స్కోర్ బోర్డు వేగం తగ్గింది.
తేవాటియా సూపర్ క్యాచ్..
గోపాల్ వేసిన పదో ఓవర్ ఆఖరి బంతికి విరాట్ భారీ సిక్సర్ కొట్టడంతో 10 ఓవర్లలో ఆర్సీబీ 77 రన్స్ చేసింది. అనంతరం మరో రెండు ఓవర్లలో కూడా బౌండరీలు రాకపోవడంతో ఈ జోడీపై ఒత్తిడి నెలకొంది. ఈ క్రమంలో రాహుల్ తెవాటియా బౌలింగ్లో కోహ్లీ భారీ సిక్సర్ కొట్టాడు. కానీ ఈ మ్యాచ్లో పూర్తిగా డిఫెన్స్కే పరిమితమైన పడిక్కల్ ఒత్తిడిలో భారీ షాట్కు ప్రయత్నించి క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. కార్తీక్ త్యాగీ వేసిన 14 ఓవర్ ఫస్ట్ బాల్ను కోహ్లీ డీప్ మిడ్ వికెట్ మీదుగా భారీ షాట్ ఆడగా.. తెవాటియా సూపర్ క్యాచ్ ఫీట్తో ఔరా అనిపించాడు. బౌండరీ రోప్పై చాకచక్యంగా బంతిని అందుకున్నాడు. దాంతో మ్యాచ్ రాజస్థాన్ వైపు తిరిగింది.
డి'విలియం'..
ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన డివిలియర్స్, గుర్క్రీత్ సింగ్ కుదురుకోవడానికి టైమ్ తీసుకోవడంతో చేజింగ్ రన్ రేట్ అమాంతం పెరిగింది. అయితే ఆర్చర్ వేసిన 16వ ఓవర్లో ఏబీడీ సిక్సర్ కొట్టడంతో 10 రన్స్ వచ్చాయి. దాంతో చివరి 24 బంతుల్లో ఆర్సీబీ విజయానికి 54 పరుగులు అవసరమయ్యాయి. ఈ క్రమంలో డివిలియర్స్ ధాటిగా ఆడుతూ ఆశలు రేకెత్తించాడు. ఉనాద్కత్ వేసిన 19వ ఓవర్లో ఏబీడీ హ్యాట్రిక్ సిక్స్లు కొట్టగా.. గుర్క్రీత్ బౌండరీ బాదడంతో మొత్తం 25 పరుగులు వచ్చాయి. ఈ ఓవర్తో మ్యాచ్ ఆర్సీబీ వైపు మళ్లింది.
ఆఖరి ఓవర్లో విజయానికి 10 పరుగులు కావాల్సి ఉండగా.. ఆర్చర్ వేసిన తొలి మూడు బంతులకు 5 పరుగులే రావడంతో ఉత్కంఠతను తలిపించింది. అయితే నాలుగో బంతిని డివిలియర్స్ భారీ సిక్సర్గా మలచడంతో ఆర్సీబీ విజయం లాంఛనమైంది.