టీ20ల్లో బౌలింగ్ చాలా కీలకం
"ఎందుకంటే టీ20ల్లో బౌలింగ్ చాలా కీలకం. వీలైనంత మంది బ్యాకప్ బౌలర్లు ఉంటే ఆ జట్టుకు ఎంతో లాభం. అయితే, టీ20ల్లో బౌలర్లకు రాణించడానికి తక్కువ అవకాశాలు ఉంటాయి. వారికి లభించే నాలుగు అంతకంటే తక్కువ ఓవర్లలోనే వాళ్లు సత్తా చాటాల్సి ఉంటుంది. ఈ విషయంలో సన్రైజర్స్ బౌలర్లది ముందంజలో ఉన్నారు" అని కుంబ్లే అన్నాడు.
స్టార్ ప్లేయర్లు లేకపోయినా
నిజానికి స్టార్ ప్లేయర్లు లేకపోయినా... జట్టులో ఉన్న వాళ్లే అద్భుతాలు చేస్తారు. ఐపీఎల్లోకి అడుగుపెట్టినప్పట్నించీ సన్రైజర్స్ బలం, బలగం మొత్తం బౌలింగే. టోర్నీలోని మిగతా జట్లతో పోలిస్తే బౌలింగ్తో పోలిస్తే టాప్-3లో కచ్చితంగా ఉంటుంది. భువీ సారథ్యంలో పేస్ అటాక్ జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించింది. ముఖ్యంగా యువ బౌలర్లు ఖలీల్ అహ్మద్, సిద్ధార్థ్ కౌల్.. భువీకి చక్కని సహకారం అందిస్తున్నారు.
|
సంచలనాలు నమోదు
ఈ ముగ్గురూ కలిసి చెన్నై, బెంగళూరు, కోల్కతాలాంటి జట్లపై సంచలనాలు నమోదు చేశారు. సన్రైజర్స్ విజయాల్లో స్పిన్నర్ల పాత్ర కూడా మరువలేనిది. ఆప్ఘన్ స్పిన్ సంచనలం రషీద్ ఖాన్ జట్టుకు ఓ తురుపు ముక్క లాంటివాడు. ప్రత్యర్థి వేదికల్లోనే ఆయా జట్లను చిత్తుగా ఓడించడంలో ఇతని పాత్ర ఎంతో కీలకం. బంగ్లా ఆల్రౌండర్ షకీబుల్ హసన్ కూడా తక్కువేమీ కాదు.
|
సన్రైజర్స్ జట్టు సమతూకంతో
వికెట్లు తీయడంతో పాటు పరుగులు నిరోధించడంలో షకీబుల్ హసన్ దిట్ట. దీంతో పాటు సన్రైజర్స్ జట్టు సమతూకంతో ఉంటుంది. ఆల్రౌండర్లు విజయ్ శంకర్, దీపక్ హుడా, యూసుఫ్ పఠాన్ను బౌలింగ్లో ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు. మే30న ఇంగ్లాండ్ వేదికగా వన్డే వరల్డ్కప్ జరగనున్న నేపథ్యంలో వార్నర్, మనీష్ పాండే, విజయ్ శంకర్లాంటి ఆటగాళ్లకు ఇదో గొప్ప అవకాశం.
సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు
కేన్ విలియమ్సన్ (కెప్టెన్), వార్నర్, అభిషేక్ శర్మ, ఖలీల్ అహ్మద్, జానీ బెయిర్స్టో, బాసిల్ థంపీ, రికీ భుయ్, శ్రీవాస్త గోస్వామి, మార్టిన్ గుప్తిల్, దీపక్ హుడా, సిద్ధార్థ్ కౌల్, భువనేశ్వర్, మహ్మద్ నబీ, షాబాజ్ నదీమ్, నటరాజన్, మనీష్ పాండే, యూసుఫ్ పఠాన్, రషీద్ ఖాన్, వృద్ధిమాన్ సాహా, సందీప్ శర్మ, విజయ్ శంకర్, షకీబ్ ఉల్ హాసన్, బిల్లీ స్టాన్లేక్.