పార్థీవ్ మెరుపులు:
188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరుకు ఓపెనర్లు పార్థీవ్ పటేల్, విరాట్ కోహ్లీలు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ముఖ్యంగా పార్థీవ్ బౌండరీలతో విరుచుకుపడ్డాడు. ఈ జోడి తొలి వికెట్కు 63 పరుగులు జోడించింది. అయితే రబడా వేసిన 6వ ఓవర్ ఐదో బంతికి పార్థీవ్ 39(20 బంతుల్లో 7x4, 1x6) అవుట్ అయ్యాడు. అనంతరం అక్షర్ వేసిన 8వ ఓవర్ రెండో బంతికి కోహ్లీ 23(17 బంతుల్లో 2x4, 1x6) కూడా పెవిలియన్ చేరాడు.
స్టోనిస్ విఫలం:
కష్టాల్లో పడ్డ బెంగళూరును డివిలియర్స్, దూబేలు ఆదుకున్నారు. ధాటిగా ఆడే క్రమంలో రూతర్ ఫోర్డ్ వేసిన 12వ ఓవర్ మూడో బంతికి డివిలియర్స్ (17) వెనుదిరిగాడు. ఆ వెంటనే క్లాసెన్ కూడా పెవిలియన్ చేరాడు. ఈ దశలో గుర్కీరత్, స్టోనిస్ జట్టును గెలిపించే ప్రయత్నం చేశారు. గుర్కీరత్ ధాటిగా ఆడినా.. స్టోనిస్ మాత్రం బ్యాట్ జులిపించలేకపోయాడు. మరోవైపు ఇన్నింగ్స్ చివరలో ఢిల్లీ బౌలర్లు రబాడా, ఇషాంత్ కట్టుదిట్టంగా బంతులేయడంతో బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసి ఓడిపోయింది.
ధావన్, అయ్యర్ల అర్ధ శతకాలు:
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 187 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ పృథ్వీషా (18) త్వరగానే ఔటైనా.. మరో ఓపెనర్ శిఖర్ ధావన్(50; 37 బంతుల్లో 5 x4, 2x6), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (52; 37 బంతుల్లో 2x4, 3x6) అర్ధ శతకాలు చేసి పెవిలియన్ చేరారు. అనంతరం పంత్ (7), కొలిన్ ఇంగ్రామ్(11) నిరాశపరిచినా.. ఇన్నింగ్స్ చివరలో రూథర్ ఫోర్డ్(28; 13 బంతుల్లో 1x4, 3x6), అక్షర్ పటేల్ (16; 9 బంతుల్లో 3x4) మెరుపు బ్యాటింగ్ చేశారు. బెంగళూరు బౌలర్లలో చాహల్ రెండు వికెట్లు తీసాడు.