లివింగ్స్టోన్ మెరుపులు:
161 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్కు ఓపెనర్లు లివింగ్స్టోన్, రహానెలు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఈ జోడి 2 ఓవర్లలో 8 పరుగులు చేశారు. భువీ వేసిన మూడో ఓవర్లో రహానే 2 బౌండరీలు బాదాడు. స్పిన్నర్ రషీద్ ఖాన్ వేసిన 4వ ఓవర్లో రహానే, లివింగ్స్టోన్లు చెరో సిక్సర్ కొట్టారు. సిద్ధార్థ్ కౌల్ వేసిన ఆరో ఓవర్లో లివింగ్స్టోన్ 4, 0, 6, 0, 4, 6తో 20 పరుగులు రాబట్టాడు. దీంతో 6 ఓవర్లలోనే 60 పరుగులు చేసి రాజస్థాన్ మంచి స్థితిలో నిలిచింది.
మెరిసిన శాంసన్:
రషీద్ వేసిన పదో ఓవర్లో లివింగ్స్టోన్ (44; 26 బంతుల్లో 4×4, 3×6) అవుట్ అయ్యాడు. అనంతరం రహానే (39; 4 ఫోర్లు, 1 సిక్స్) షకీబ్ బౌలింగ్లో నిష్క్రమించాడు. ఈ సమయంలో క్రిజులోకి వచ్చిన సంజు శాంసన్, స్టీవెన్ స్మిత్లు స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఈ క్రమంలో రాజస్థాన్ను లక్యం దిశగా తీసుకెళ్లారు. అయితే ఖలీల్ వేసిన 17వ ఓవర్లో భారీ షాట్కు యత్నించిన స్మిత్ (16 బంతుల్లో 22; 3 ఫోర్లు) సిద్ధార్థ్ కౌల్ చేతికి చిక్కాడు. అప్పటికి రాయల్స్ విజయానికి 13 పరుగులు చేయాలి. మిగతా లాంఛనాన్నిటర్నర్ (3)తో కలిసి శాంసన్ (48 నాటౌట్; 32 బంతుల్లో 4×4, 1×6) పూర్తి చేశాడు. 19.1 ఓవర్లలో లక్షాన్ని అందుకుని రాజస్థాన్ పాంట్లను మెరుగుపరుచుకుంది.
పాండే అర్ధ శతకం:
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన సన్రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. రాజస్థాన్ బౌలర్లు ఉనద్కత్ (2/26), థామస్ (2/28), శ్రేయస్ గోపాల్ (2/30)లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో సన్రైజర్స్ ఆటగాళ్ళు ధాటిగా పరుగులు చేయలేకపోయారు. మనీష్ పాండే (61; 36 బంతుల్లో 9×4) అర్ధ శతకం చేసాడు. వార్నర్ (37) ధాటిగా ఆడలేకపోయాడు. ఇన్నింగ్స్ చివరలో వరుస వికెట్లు కోల్పోయిన సన్రైజర్స్ సాధారణ పరుగులకే పరిమితమైంది.