For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్ వేలం 2019 విశేషాలు: కొందరికి జాక్‌పాట్, మరికొందరికి నిరాశ

IPL 2019 Auction Live

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2019 సీజన్ వేలం ముగిసింది. వచ్చే సీజన్ కోసం ఆటగాళ్ల వేలం జైపూర్‌లో మంగళవారం జరిగింది. గత పదకొండు సీజన్లలో వేలానికి వ్యాఖ్యాతగా వ్యవహారించిన రిచర్డ్ హ్యాడ్లీ స్థానంలో ఈసారి హ్యూస్‌ ఎడ్‌మెయిడాస్‌ వేలం నిర్వహించారు.

ప్రపంచవ్యాప్తంగా 1,003 మంది క్రికెటర్లు వేలంలో పాల్గొనడానికి ధరఖాస్తు చేసుకోగా ప్రాంచైజీల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ 351 మందితో కూడిన తుది జాబితాను ప్రకటించింది. 118 మంది జాతీయ జట్లకు ఆడిన క్రికెట‌ర్లు, 228 మంది దేశవాళీ ఆటగాళ్లు వేలంలో పాల్గొన్నారు.

ఐపీఎల్ 2019 వేలానికి సంబంధించిన అప్‌డేట్స్ మీకోసం:

Dec 18, 2018, 9:11 pm IST

ఐపీఎల్ 2019 వేలం ముగిసింది.

Dec 18, 2018, 9:10 pm IST

రేయాన్ పరాగ్‌ను రూ.20 లక్షలకు కొనుగోలు చేసిన రాజస్థాన్ రాయల్స్

Dec 18, 2018, 9:09 pm IST

ఆష్టన్ టర్నర్‌ను రూ. 50 లక్షలకు కొనుగోలు చేసిన రాజస్థాన్ రాయల్స్

Dec 18, 2018, 9:09 pm IST

మనన్ వోహ్రాని రూ.20 లక్షలకు కొనుగోలు చేసిన రాజస్థాన్ రాయల్స్

Dec 18, 2018, 9:06 pm IST

శ్రీకాంత్ ముదేను రూ. 20 లక్షలకు కొనుగోలు చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్

Dec 18, 2018, 9:05 pm IST

బండారు అయ్యప్పని రూ. 20 లక్షలకు కొనుగోలు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్

Dec 18, 2018, 9:01 pm IST

జోయ్ డెన్లేని రూ. కోటికి కోల్‌కతా సొంతం చేసుకుంది.

Dec 18, 2018, 9:01 pm IST

శుభమ్ రంజనేను రూ. 20 లక్షలకు రాజస్థాన్ రాయల్స్ సొంతం చేసుకుంది.

Dec 18, 2018, 9:00 pm IST

మురుగన్ అశ్విన్‌ను రూ. 20 లక్షలకు కొనుగోలు చేసిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్.

Dec 18, 2018, 9:00 pm IST

తుషార్ దేశ్ పాండేను కొనుగోలు చేసేందుకు ఏ ప్రాంఛైజీ ఆసక్తి కనబర్చలేదు.

Dec 18, 2018, 8:59 pm IST

జలజ్ సక్సేనాను రూ. 20 లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది.

Dec 18, 2018, 8:38 pm IST

ఐపీఎల్ 2019 వేలానికి 10 నిమిషాల విరామం

Dec 18, 2018, 8:31 pm IST

అక్షదీఫ్ నాథ్‌ను రూ. 3.6 కోట్లకు కోనుగోలు చేసిన ఆర్సీబీ.

Dec 18, 2018, 8:26 pm IST

రెండోసారి యువీని రూ.కోటికి సొంతం చేసుకున్న ముంబై

Dec 18, 2018, 8:25 pm IST

రెండోసారి కూడా మనోజ్ తివారికి నిరాశే. ఆసక్తి చూపని ప్రాంఛైజీలు

Dec 18, 2018, 8:24 pm IST

రెండోసారి వేలంలో మార్టిన్ గుప్టిల్‌ను రూ.కోటికి దక్కించుకున్న హైదరాబాద్

Dec 18, 2018, 8:22 pm IST

హర్ ప్రీత్ బ్రార్‌ను రూ.20 లక్షలకు పంజాబ్ సొంతం చేసుకుంది.

Dec 18, 2018, 8:21 pm IST

అగ్నివేష్ ఆయాచి, హర్ ప్రీత్ బ్రార్‌లను రూ.20 లక్షలకు పంజాబ్ సొంతం చేసుకుంది.

Dec 18, 2018, 8:19 pm IST

ప్రయాస్ రే బర్మన్‌ను రూ. 1.5 కోట్లకు ఆర్సీబీ సొంతం చేసుకుంది.

Dec 18, 2018, 8:15 pm IST

వెస్టిండిస్ ఆటగాడు కీమో పాల్‌ను రూ.50 లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది.

Dec 18, 2018, 8:15 pm IST

లియామ్ లివింగ్ స్టోన్‌ను రూ. 50 లక్షలకు రాజస్థాన్ రాయల్స్ సొంతం చేసుకుంది.

Dec 18, 2018, 8:14 pm IST

పృథ్విరాజ్ యర్రాను రూ. 20 లక్షలకు కోల్‌కతా సొంతం చేసుకుంది.

Dec 18, 2018, 8:13 pm IST

రసిక్ ఢర్‌ను రూ. 20 లక్షలకు ముంబై సొంతం చేసుకుంది.

Dec 18, 2018, 8:13 pm IST

కనీసధర రూ.20 లక్షలతో ఐపీఎల్ వేలంలోకి వచ్చిన వికెట్ కీపర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్‌ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ రూ. 4.8 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది.

Dec 18, 2018, 8:07 pm IST

లలిత్ యాదన్‌ను కొనుగోలు చేసేందుకు ఏ ప్రాంఛైజీ ఆసక్తి కనబర్చలేదు.

Dec 18, 2018, 8:06 pm IST

శశాంక్ సింగ్‌ను రూ.30 లక్షలకు రాజస్థాన్ రాయల్స్ జట్టు సొంతం చేసుకుంది.

Dec 18, 2018, 8:05 pm IST

సాయిరాజ్ పాటిల్, స్వప్నిల్ సింగ్‌లను కొనుగోలు చేసేందుకు ఏ ప్రాంఛైజీ ఆసక్తి కనబర్చలేదు.

Dec 18, 2018, 8:04 pm IST

దర్శన్ నాల్కండేను రూ. 30 లక్షలకు పంజాబ్ జట్టు సొంతం చేసుకుంది.

Dec 18, 2018, 8:03 pm IST

మిలింద్ కుమార్‌ను రూ.20 లక్షలకు ఆర్సీబీ కొనుగోలు చేసింది.

Dec 18, 2018, 8:03 pm IST

పంకజ్ జైస్వాల్‌ను రూ.20 లక్షలకు ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది.

Dec 18, 2018, 8:02 pm IST

హ్యారీ గుర్నేను రూయ 75 లక్షలకు కొనుగోలు చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్.

Dec 18, 2018, 8:02 pm IST

ఆష్టన్ టర్నర్ ను కొనుగోలు చేసేందుకు ఏ ప్రాంఛైజీ ఆసక్తి కనబర్చలేదు.

Dec 18, 2018, 8:01 pm IST

కనీస ధర రూ. 75 లక్షలతో వేలంలోకి వచ్చిన సికిందర్ రాజాను కొనుగోలు చేసేందుకు ఏ ప్రాంఛైజీ ఆసక్తి కనబర్చలేదు.

Dec 18, 2018, 8:00 pm IST

జస్‌కర్ణ్ సింగ్, సందీప్ వారియర్, ఫాబిన్ అలెన్‌లను కొనుగోలు చేసేందుకు ఏ ప్రాంఛైజీ ఆసక్తి కనబర్చలేదు.

Dec 18, 2018, 7:59 pm IST

అర్షదీప్ సింగ్‌ను రూ. 20 లక్షలకు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సొంతం చేసుకుంది.

Dec 18, 2018, 7:58 pm IST

విష్ణు వినోద్ ను కొనుగోలు చేసేందుకు ఏ ప్రాంఛైజీ ఆసక్తి కనబర్చలేదు.

Dec 18, 2018, 7:58 pm IST

నిఖిల్ నాయక్‌ను కోల్ కతా నైట్ రైడర్స్ రూ. 20 లక్షలకు సొంతం చేసుకుంది.

Dec 18, 2018, 7:57 pm IST

హిమ్మత్ సింగ్‌ను రూ. 65 లక్షలకు బెంగళూరు సొంతం చేసుకుంది.

Dec 18, 2018, 7:56 pm IST

హిమన్షు రాణాను కొనుగోలు చేసేందుకు ఏ ప్రాంఛైజీ ఆసక్తి కనబర్చలేదు.

Dec 18, 2018, 7:54 pm IST

హార్డిస్ విల్జోన్‌ను రూ. 75 లక్షలకు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కొనుగోలు చేసింది.

Dec 18, 2018, 7:54 pm IST

రూ. 1.1 కోటికి ఓషానే టోమస్‌ను రాజస్థాన్ రాయల్స్ సొంతం చేసుకుంది.

Dec 18, 2018, 7:53 pm IST

డాన్ క్రిస్టియన్, మన్ ప్రీత్ గోనే, అలీ ఖాన్, జేమ్స్ ప్యాటిన్ సన్‌లను కొనుగోలు చేసేందుకు ఏ ప్రాంఛైజీ ఆసక్తి కనబర్చలేదు.

Dec 18, 2018, 7:52 pm IST

ఖయాస్ అహ్మద్, సత్యజిత బచావ్, జోయ్ డెన్లే, రైలీ రూస్కూ లను కొనుగోలు చేసేందుకు ఏ ప్రాంఛైజీ ఆసక్తి కనబర్చలేదు.

Dec 18, 2018, 7:48 pm IST

అనిర్జ్ నోర్జ్జే‌ను రూ.20 లక్షలకు కోల్‌కతా సొంతం చేసుకుంది.

Dec 18, 2018, 7:46 pm IST

కనీసధర రూ. 40 లక్షలతో వేలంలోకి వచ్చిన షెర్ఫానే రూథర్‌ఫోర్డ్ ను రూ. 2 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది.

Dec 18, 2018, 7:45 pm IST

ప్రవీణి దుబే, శుభమ్ రంజనీలను కొనుగోలుచేసేందుకు ఏ ప్రాంఛైజీ ఆసక్తి కనబర్చలేదు.

Dec 18, 2018, 7:41 pm IST

ఐపీఎల్ 2019 వేలం తిరిగి ప్రారంభమైంది.

Dec 18, 2018, 7:10 pm IST

ఐపీఎల్ 2019 వేలంలో టీ విరామం. తిరిగి 7:30 గంటలకు వేలం ప్రారంభం కానుంది.

Dec 18, 2018, 7:10 pm IST

ప్రాంఛైజీల వద్ద మిగిలిన నగదు: KKR : 8.60 crore RR : 10.15 crore CSK : 3.40 crore RCB : 7.75 crore KXIP : 10.35 crore SRH : 6.30 crore DC : 10.60 crore MI : 4.95 crore

Dec 18, 2018, 6:47 pm IST

ఐపీఎల్ 2019 వేలంలో టీ విరామం. తిరిగి 7:30 గంటలకు వేలం ప్రారంభం కానుంది.

Dec 18, 2018, 6:46 pm IST

ప్రతి ఒక్క ప్రాంఛైజీ కూడా 7 నుంచి 15 వరకు ప్లేయర్లను సమర్పించాల్సి ఉంది.

Dec 18, 2018, 6:42 pm IST

కనీసధర రూ.కోటిన్నరతో వేలంలోకి వచ్చిన దక్షిణాఫ్రికా పేసర్ డేల్ స్టెయిన్‌ను కొనుగోలు చేసేందుకు ఏ ప్రాంఛైజీ ఆసక్తి కనబర్చలేదు.

Dec 18, 2018, 6:41 pm IST

కనీసధర రూ.కోటితో వేలంలోకి వచ్చిన న్యూజిలాండ్ ఆటగాడు లూకీ ఫెర్గూన్‌సన్‌ను రూ. 1.6 కోట్లకు కోల్‌కతా నైట్ రైడర్స్ సొంతం చేసుకుంది.

Dec 18, 2018, 6:40 pm IST

కనీసధర రూ. కోటిన్నరతో వేలంలోకి వచ్చిన దక్షిణాఫ్రికా ఆటగాడు మోర్నీ మోర్కెల్‌ను కొనుగోలు చేసేందుకు ఏ ప్రాంఛైజీ ఆసక్తి కనబర్చలేదు.

Dec 18, 2018, 6:39 pm IST

కనీసధర రూ. 50 లక్షలతో వేలంలోకి వచ్చిన అభిమన్యు మిథున్‌ను కొనుగోలు చేసేందుకు ఏ ప్రాంఛైజీ ఆసక్తి కనబర్చలేదు.

Dec 18, 2018, 6:38 pm IST

అమ్ముడుపోని ఆటగాడిగా కేన్ రిచర్డ్‌సన్.

Dec 18, 2018, 6:38 pm IST

కనీసధర రూ. 50 లక్షలతో వేలంలోకి వచ్చిన కర్ణాటక రంజీ కెప్టెన్ వినయ్ కుమార్‌ను ఏ ప్రాంఛైజీ కోనుగోలు చేయలేదు.

Dec 18, 2018, 6:37 pm IST

కనీసధర రూ.50 లక్షలతో వేలంలోకి వచ్చిన బరీందర్ శ్రణ్‌ను రూ. 3.4 కోట్లకు ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది.

Dec 18, 2018, 6:34 pm IST

అమ్ముడుపోని ఆటగాడిగా గ్లెన్ ఫిలిప్స్

Dec 18, 2018, 6:33 pm IST

హెన్రిచ్ క్లాసెన్‌ను రూ. 50 లక్షలకు సొంతం చేసుకున్న అర్సీబీ

Dec 18, 2018, 6:33 pm IST

అమ్ముడుపోని ఆటగాడిగా శ్రీలంక ఆటాగడు కుశాల్ పెరీరా

Dec 18, 2018, 6:32 pm IST

ఐపీఎలీ వేలంపై సతీష్ మీనన్

Dec 18, 2018, 6:31 pm IST

లూక్ రోంచి, ముష్ఫికర్ రహీంను కొనుగోలు చేసేందుకు ఏ ప్రాంఛైజీ ఆసక్తి కనబర్చలేదు.

Dec 18, 2018, 6:30 pm IST
Mykhel

కనీసధర రూ. 2 కోట్లతో వేలంలోకి వచ్చిన శామ్ కర్రన్‌ను దక్కించుకునేందుకు ఢిల్లీ, బెంగళూరు పోటీ పడ్డాయి. ఈ పోటీలో చివరకు రూ. 7.2 కోట్లకు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సొంతం చేసుకుంది.

Dec 18, 2018, 6:24 pm IST

కనీసధర రూ. 75 లక్షలతో వేలంలోకి వచ్చిన వెస్టిండిస్ ఆటగాడు జాసన్ హోల్డర్‌ని ఏ ప్రాంఛైజీ కోనుగోలు చేయలేదు

Dec 18, 2018, 6:24 pm IST

పర్వేజ్ రసూల్‌ను ఏ ప్రాంఛైజీ కోనుగోలు చేయలేదు

Dec 18, 2018, 6:23 pm IST

అమ్ముడుపోని ఆటగాడిగా కోరీ అండర్సన్‌

Dec 18, 2018, 6:22 pm IST

కనీసధర రూ.50 లక్షలతో వేలంలోకి వచ్చిన రిషి ధావన్‌ను కొనుగోలు చేసేందుకు ఏ ప్రాంఛైజీ ఆసక్తి కనబర్చలేదు

Dec 18, 2018, 6:22 pm IST

శ్రీలంక ఆటగాడు ఏంజెలో మ్యాథ్యూస్‌ను కొనుగోలు చేసేందుకు ఏ ప్రాంఛైజీ ఆసక్తి కనబర్చలేదు

Dec 18, 2018, 6:21 pm IST

కనీసధర రూ. 75 లక్షలతో వేలంలోకి వచ్చిన జేమ్స్ నీషమ్‌ను కొనుగోలు చేసేందుకు ఏ ప్రాంఛైజీ ఆసక్తి కనబర్చలేదు.

Dec 18, 2018, 6:20 pm IST

అమ్ముడుపోని ఆటగాడిగా దక్షణాఫ్రికా ఆటగాడు హషీం ఆమ్లా

Dec 18, 2018, 6:19 pm IST

షాన్ మార్ష్, సౌరభ తివారీని కొనుగోలు చేసేందుకు ఏ ప్రాంఛైజీ ఆసక్తి కనబర్చలేదు.

Dec 18, 2018, 6:18 pm IST
Mykhel

కనీసధర రూ. 2 కోట్లతో వేలంలోకి వచ్చిన దక్షిణాఫ్రికాకు చెందిన కొలిన్ ఇంగ్రన్‌ను రూ. 6.4 కోట్లకు కొనుగోలు చేసింది.

Dec 18, 2018, 6:14 pm IST

కనీసధర రూ. 50 లక్షలతో వేలంలోకి వచ్చిన రీజా హెండ్రిక్స్‌ను ఏ ప్రాంఛైజీ కొనుగోలు చేయలేదు.

Dec 18, 2018, 6:13 pm IST

ఆప్ఘన్‌కు చెందిన హజ్రతుల్లా జజాయ్ ఏ ప్రాంచైజీ కొనుగోలు చేయలేదు.

Dec 18, 2018, 6:12 pm IST

విరామం అనంతరం ప్రారభమైన వేలంలో అమ్ముడుపోని ఆటగాడిగా ఉస్మాన్ ఖవాజా నిలిచాడు

Dec 18, 2018, 6:02 pm IST

ఐపీఎల్ వేలం 2019కి 10 నిమిషాల విరామం

Dec 18, 2018, 5:59 pm IST

కేసీ కరియప్ప, రవి సాయి కిశోర్, మురుగన్ అశ్విన్ కొనుగోలు చేసేందుకు ఏ ప్రాంఛైజీ ఆసక్తి కనబర్చలేదు.

Dec 18, 2018, 5:58 pm IST

యువరాజ్ చూడసమ, జకీర్ ఖాన్ ఫక్తీన్‌ను కొనుగోలు చేసేందుకు ఏ ప్రాంఛైజీ ఆసక్తి కనబర్చ లేదు.

Dec 18, 2018, 5:56 pm IST

ఇప్పుడు స్పిన్నర్ల వంతు... మొట్టి మొదటి ఆటగాడిగా జె సుచిత్ వచ్చాడు. అతడిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపని ప్రాంఛైజీలు.

Dec 18, 2018, 5:56 pm IST

నాతు సింగ్‌ను రూ. 20 లక్షలకు సొంతం చేసుకున్న ఢిల్లీ

Dec 18, 2018, 5:55 pm IST

తుషార్ దేశ్‌పాండే కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపని ప్రాంఛైజీలు.

Dec 18, 2018, 5:54 pm IST

రజనీష్ గుర్బానీ, చాలా మిలింద్‌లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపని ప్రాంఛైజీలు.

Dec 18, 2018, 5:52 pm IST

అనికేత్ చౌదరి, ఇషాన్ పోరెల్‌లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపని ప్రాంఛైజీలు.

Dec 18, 2018, 5:51 pm IST

కేఎస్ భరత్, అరుణ్ కార్తిక్ భాస్కర్ ను కొనుగోలు చేసేందుకు ఏ ప్రాంఛైజీ ఆసక్తి కనబర్చలేదు.

Dec 18, 2018, 5:50 pm IST

రూ. 20 లక్షలకు అంకుష్ బెయిన్సను సొంతం చేసుకున్న ఢిల్లీ క్యాపిటల్స్

Dec 18, 2018, 5:49 pm IST

అమ్ముడుపోని ఆటగాడిగా నిలిచిన అనుజ్ రావత్

Dec 18, 2018, 5:48 pm IST

షెల్డన్ జాక్సన్, బాబా ఇంద్రజిత్‌ను కొనుగోలు చేసేందుకు ఏ ప్రాంఛైజీ ఆసక్తి కనబర్చలేదు.

Dec 18, 2018, 5:46 pm IST

అమ్ముడుపోని ఆటగాడిగా జలజ్ సక్సేనా

Dec 18, 2018, 5:45 pm IST
Mykhel

కనీసధర రూ. 20 లక్షలతో వేలంలోకి వచ్చిన వరున్ చక్రవర్తిని రూ. 8.4 కోట్లకు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కొనుగోలు చేసింది. ఇప్పటివరకు వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాడు ఇతడే కావడం విశేషం.

Dec 18, 2018, 5:36 pm IST
Mykhel

శివం దూబె కనీసధర(రూ.20లక్షలు)కు ప్రారంభమై రూ.5 కోట్లకు బెంగళూరు జట్టుకు సొంతమైయ్యాడు.

Dec 18, 2018, 5:31 pm IST

ఆయూష్ బదోనీ కనీసధర(రూ.20లక్షలు)ఎవరూ కొనుగోలు చేయలేదు.

Dec 18, 2018, 5:30 pm IST

సర్ఫరాజ్ ఖాన్ కనీసధర కనీస ధర రూ.20లక్షలకు ప్రారంభమై పంజాబ్ జట్టుకు సొంతమైయ్యాడు.

Dec 18, 2018, 5:29 pm IST

అక్ష్‌దీప్ సింగ్ కనీసధర(రూ.20లక్షలు)కూడా ఏ జట్టు ఆసక్తి చూపలేదు.

Dec 18, 2018, 5:28 pm IST

ఆర్మాన్ జాఫర్ కనీసధర(రూ.20లక్షలు)కు మొదలైన వేలం ఆసక్తి చూపకపోవడంతో మిగిలిపోయాడు.

Dec 18, 2018, 5:27 pm IST

అన్‌మోల్ ప్రీత్ సింగ్ కనీస ధర రూ.20లక్షలకు వేలం మొదలవగా ముంబై ఇండియన్స్ రూ.80లక్షలకు సొంతం చేసుకుంది.

Dec 18, 2018, 5:26 pm IST

అంకిత్ బవానె కనీస ధర రూ20.లక్షలకు ఏ జట్టూ కొనుగోలు చేయలేదు.

Dec 18, 2018, 5:25 pm IST

సచిన్ బేబీ కనీస ధర రూ.20లక్షలకు ఏ జట్టు ఆసక్తి చూపకపోవడంతో మిగిలిపోయాడు.

Dec 18, 2018, 5:24 pm IST

కనీసధర రూ.20లక్షలకు మనన్ వోహ్రను ఏ జట్టు ఆసక్తి చూపకపోవడంతో ..

Dec 18, 2018, 5:23 pm IST

కనీసధర రూ.20లక్షలకు దేవ్‌దత్త పడిక్కల్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేసింది.

Dec 18, 2018, 5:14 pm IST

ఐపీఎల్ 2019 వేలానికి 15 నిమిషాల విరామం.

Dec 18, 2018, 5:14 pm IST

ఇప్పటివరకు జరిగిన ఐపీఎల్ వేలంలో అత్యధికంగా జయదేవ్ ఉనాద్కత్‌ను రూ. 8.4 కోట్లకు రాజస్థాన్ సొంతం చేసుకోగా.. ఆ తర్వాతి స్థానాల్లో అక్షర పటేల్ (రూ. 5 కోట్లు, ఢిల్లీ), కార్లోస్ బ్రాత్‌వైట్ (రూ. 5కోట్లు, కోల్ కతా), మోహిత్ శర్మ (రూ. 5 కోట్లు, చెన్నై), షమీ (రూ. 4.8 కోట్లు పంజాబ్)లు ఉన్నారు.

Dec 18, 2018, 5:10 pm IST

ఐపీఎల్ 2019 వేలానికి 15 నిమిషాల విరామం.

Dec 18, 2018, 5:06 pm IST

ఇప్పటివరకు అమ్మడుపోయిన ఆటగాళ్లలో అత్యధిక ధర పలికిన ఆటగాళ్లలో జయదేవ్ ఉనాద్కత్‌ను రూ. 8.4 కోట్లకు రాజస్థాన్ దక్కించుకోగా... ఆ తర్వాత స్థానాల్లో బ్రాత్ వైట్ ధర రూ. 5 కోట్లకు కోల్‌కతా, అక్షర పటేల్‌ను రూ. 5 కోట్లకు ఢిల్లీ, షమీని రూ. 4.8 కోట్లకు పంజాబ్ సొంతం చేసుకున్నాయి.

Dec 18, 2018, 5:06 pm IST

ఫవేద్ అహ్మద్‌ని ఏ ప్రాంఛైజీ కూడా కొనుగోలు చేయలేదు.

Dec 18, 2018, 5:05 pm IST

వెస్టిండిస్ ఆటగాడు క్యారీ పియరీని ఏ ప్రాంఛైజీ కూడా కొనుగోలు చేయలేదు.

Dec 18, 2018, 5:04 pm IST

కనీసధర రూ.కోటితో వేలంలోకి వచ్చిన ఆసీస్ ఆటగాడు ఆడమ్ జంపాను కొనుగోలు చేసేందుకు ఏ ప్రాంఛైజీ కూడా ఆసక్తి కనబర్చలేదు.

Dec 18, 2018, 5:03 pm IST

రాహల్ శర్మను ఏ ప్రాంఛైజీ కొనుగోలు చేయలేదు.

Dec 18, 2018, 5:02 pm IST

కనీసధర రూ. 50 లక్షలతో వేలంలోకి వచ్చిన ఫాస్ట్ బౌలర్ మొహిందర్ శర్మను రూ. 5 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకుంది.

Dec 18, 2018, 4:58 pm IST

కనీసధర రూ. 50 లక్షలతో వేలంలోకి వచ్చిన ఫాస్ట్ బౌలర్ వరుణ్ ఆరోన్‌ని 2.4 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది.

Dec 18, 2018, 4:53 pm IST
Mykhel

కనీసధర రూ. కోటితో వేలంలోకి వచ్చిన పేసర్ మహ్మద్ షమీ కోసం చెన్నై, పంజాబ్ ప్రాంఛైజీలు పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో షమీ ధర రూ. 4.2 కోట్ల వరకు పలికింది. చివరకు షమీని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు రూ. 4.8 కోట్లకు సొంతం చేసుకుంది.

Dec 18, 2018, 4:48 pm IST

రూ. 2 కోట్లకు శ్రీలంక ప్లేయర్ లసిత్ మలింగను దక్కించుకున్న ముంబై ఇండియన్స్. టీ20ల్లో మలింగ ఇప్పటివరకు 353 వికెట్లు తీశాడు.

Dec 18, 2018, 4:47 pm IST

హమ్మయ్య టీమిండియా పేసర్ ఇషాంత్ శర్మ ఎట్టకేలకు ఈసారి వేలంలో అమ్ముడుపోయాడు. కనీసధర రూ. 75 లక్షలతో వేలంలోకి వచ్చిన ఇషాంత్‌ను ఢిల్లీ రూ. 1.1 కోటికి సొంతం చేసుకుంది.

Dec 18, 2018, 4:44 pm IST
Mykhel

ఉనాద్కత్ కోసం భారీ బిడ్డింగ్: జయదేవ్ ఉనాద్కత్ కోసం పంజాబ్, రాజస్థాన్ ప్రాంఛైజీలు తీవ్రంగా పోటీ పడ్డాయి. చివరకు రాజస్థాన్ రాయల్స్ రూ. 8.4 కోట్లకు వేలంలో సొంతం చేసుకుంది.

Dec 18, 2018, 4:41 pm IST

కనీసధర రూ. 1.5 కోటితో వేలంలోకి వచ్చిన జయదేవ్ ఉనాద్కత్‌ కోసం రాజస్థాన్, ఢిల్లీ ప్రాంఛైజీలు పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో జయదేవ్ ఉనాద్కత్‌ ధర రూ. 3.6 కోట్లకు చేరింది. ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ ఎంటర్ కావడంతో జయదేవ్ ఉనాద్కత్‌ ధర రూ. 6 కోట్లకు చేరుకుంది. అనంతరం పంజాబ్ రేసులోకి రావడంతో అతడి ధర రూ. 7 కోట్లను తాకింది.

Dec 18, 2018, 4:38 pm IST

కనీసధర రూ. 1.5 కోటితో వేలంలోకి వచ్చిన జయదేవ్ ఉనాద్కత్‌ కోసం రాజస్థాన్, ఢిల్లీ ప్రాంఛైజీలు పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో జయదేవ్ ఉనాద్కత్‌ ధర రూ. 3.6 కోట్లకు చేరింది. ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ రేసులోకి ఎంటర్ కావడంతో జయదేవ్ ఉనాద్కత్‌ ధర రూ. 6 కోట్లకు చేరుకుంది.

Dec 18, 2018, 4:37 pm IST

కనీసధర రూ. 1.5 కోటితో వేలంలోకి వచ్చిన జయదేవ్ ఉనాద్కత్‌ కోసం రాజస్థాన్, ఢిల్లీ ప్రాంఛైజీలు పోటీ పడుతున్నాయి.

Dec 18, 2018, 4:29 pm IST

ఐపీఎల్ వేలానికి 5 నిమిషాలు విరామం. తిరిగి మళ్లీ 4:30 గంటలకు కలుసుకుందాం..

Dec 18, 2018, 4:29 pm IST
Mykhel

కనీసధర రూ. కోటితో వేలంలోకి వచ్చిన వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాను రూ. 1.2 కోట్లకు సన్‌రైజర్స్ హైదరాబాద్ సొంతం చేసుకుంది.

Dec 18, 2018, 4:25 pm IST

కనీసధర రూ. 75 లక్షలతో వేలంలోకి వచ్చిన వెస్టిండిస్ ఆటగాడు నికోలస్ పూరన్ కోసం పంజాబ్, బెంగళూరు, ఢిల్లీ ప్రాంఛైజీలు పోటీ పడ్డాయి. ఈ పోటీలో చివరకు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ రూ. 4.2 కోట్లకు సొంతం చేసుకుంది. నికోలస్ పూరన్ 2014లో అండర్-19 వరల్డ్ ఆడాడు.

Dec 18, 2018, 4:22 pm IST
Mykhel

కనీసధర రూ. 1.5 కోట్లతో వేలంలోకి వచ్చిన ఇంగ్లాండ్ ఆటగాడు జానీ బెయిర్ స్టోను సన్ రైజర్స్ హైదరాబాద్ రూ. 2.2 కోట్లకు సొంతం చేసుకుంది.

Dec 18, 2018, 4:20 pm IST

ఆస్ట్రేలియా ఆటగాడు బెన్ మెక్‌డోర్మెట్‌ను కొనుగోలు చేసేందుకు ఏ ప్రాంఛైజీ ఆసక్తి కనబర్చలేదు.

Dec 18, 2018, 4:18 pm IST

వికెట్ కీపర్ నోమన్ ఓజాను కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంఛైజీ ఆసక్తి కనబర్చలేదు.

Dec 18, 2018, 4:17 pm IST
Mykhel

అక్షర పటేల్‌ను రూ. 5 కోట్లకు సొంతం చేసుకున్న ఢిల్లీ క్యాపిటల్స్.

Dec 18, 2018, 4:14 pm IST

హెన్రీక్యూస్‌ని రూ. కోటికి కొనుగోలు చేసిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్

Dec 18, 2018, 4:11 pm IST
Mykhel

యువరాజ్ సింగ్‌కు షాక్. తొలి రౌండ్‌లో ఏ ప్రాంఛైజీ అతడిని కొనుగోలు చేయలేదు.

Dec 18, 2018, 4:11 pm IST

కనీస ధర రూ. 50 లక్షలతో వేలంలోకి వచ్చిన గురుకీర్త్ సింగ్ మన్‌ను అంతే ధరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సొంతం చేసుకుంది.

Dec 18, 2018, 4:08 pm IST

కనీసధర రూ. కోటితో వేలంలోకి వచ్చిన క్రిస్ జోర్డాన్‌ను కొనుగోలు చేసేందుకు ఏ ప్రాంఛైజీ ఆసక్తి కనబర్చలేదు.

Dec 18, 2018, 4:07 pm IST

కనీసధర రూ.75 లక్షలతో వేలంలోకి వచ్చిన వెస్టిండిస్ ఆటగాడు కార్లోస్ బ్రాత్‌వైట్‌‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు రూ. 5 కోట్లకు సొంతం చేసుకుంది.

Dec 18, 2018, 4:06 pm IST
Mykhel

కనీసధర రూ.75 లక్షలతో వేలంలోకి వచ్చిన వెస్టిండిస్ ఆటగాడు కార్లోస్ బ్రాత్‌వైట్‌ కోసం పంజాబ్, కోల్‌కతా జట్లు పోటీ పడ్డాయి. బ్రాత్ వైట్ ధరను అమాంతం పెంచుకుంటూ పోయాయి. ఈ క్రమంలో బ్రాత్ వైట్ ధర రూ. 5 కోట్లకు చేరుకుంది.

Dec 18, 2018, 4:00 pm IST

ఆల్ రౌండర్ల జాబితాలో మొట్టమొదటి ఆటగాడు ఇంగ్లాండ్‌కు చెందిన క్రిస్ వోక్స్. క్రిస్ వోక్స్‌ని కొనుగోలు చేసేందుకు ఏ ప్రాంఛైజీ ఆసక్తి కనబర్చలేదు.

Dec 18, 2018, 3:59 pm IST

వీరితో ఐపీఎల్ వేలం 2019లో తొలిసెట్ ముగిసింది. ఆ తర్వాత వేలంలోకి ఆల్ రౌండర్లు రానున్నారు.

Dec 18, 2018, 3:59 pm IST

కనీసధర రూ.కోటితో వేలంలోకి వచ్చిన న్యూజిలాండ్ ఆటగాడు మార్టిన్ గుప్టిల్‌ను కొనుగోలు చేసేందుకు ఏ ప్రాంఛైజీ ఆసక్తి కనబర్చలేదు.

Dec 18, 2018, 3:58 pm IST

కనీసధర రూ.2 కోట్లతో వేలంలోకి వచ్చిన న్యూజిలాండ్ మాజీ ఆటగాడు బ్రెండన్ మెక్‌కల్లమ్‌ను కొనుగోలు చేసేందుకు ఏ ప్రాంఛైజీ ఆసక్తి కనబర్చలేదు.

Dec 18, 2018, 3:55 pm IST

కనీస ధర రూ. 50 లక్షలతో వేలంలోకి వచ్చిన సిమ్రన్ హెట్‌మెయిర్‌ కోసం పంజాబ్, రాజస్థాన్, సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రాంఛైజీలు పోటీ పడినప్పటికీ చివరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ. 4.2 కోట్లకు సొంతం చేసుకుంది.

Dec 18, 2018, 3:49 pm IST

కనీసధర రూ. 50 లక్షలతో వేలంలోకి వచ్చిన ఆంధ్ర ఆటగాడు హనుమ విహారిని ఢిల్లీ డేర్ డెవిల్స్ రూ. 2 కోట్లకు సొంతం చేసుకుంది.

Dec 18, 2018, 3:47 pm IST

రూ. 50 లక్షలు కనీస ధరతో వచ్చిన హనుమ విహారిని దక్కించుకునేందుకు రాజస్థాన్, ఢిల్లీ, ముంబై ప్రాంఛైజీలు పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో హనుమ విహారి బిడ్డింగ్ ధర రూ 1.6 కోట్ల వరకు వెళ్లింది.

Dec 18, 2018, 3:46 pm IST

ఐపీఎల్ 2019 వేలంలోకి రూ.కోటి కనీస ధరతో వేలంలోకి వచ్చిన అలెక్స్ హేల్స్‌ను ఏ ప్రాంఛైజీ కూడా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు.

Dec 18, 2018, 3:45 pm IST

ఐపీఎల్ 2019 వేలంలో రెండో ఆటగాడు ఛటేశ్వర్ పుజారా. కనీస ధర రూ. 50 లక్షలు. ఏ ప్రాంఛైజీ కూడా అతడిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు.

Dec 18, 2018, 3:44 pm IST

ఐపీఎల్ 2019 వేలంలో మొట్టమొదటి ఆటగాడు మనోజ్ తివారీ. కనీస ధర రూ. 50 లక్షలు. ఏ ప్రాంఛైజీ కూడా అతడిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు.

Dec 18, 2018, 3:42 pm IST

ఐపీఎల్ వేలం 2019 సీజన్‌కు సంబంధించి పూర్తి వివరాలను ఆక్షనర్ హ్యూస్‌ ఎడ్‌మెయిడాస్‌ వివరించారు. వేలానికి మొత్తం 351 మంది ప్లేయర్లు అందుబాటులో ఉన్నారని తెలిపారు. ఇందులో భారత్‌కు చెందిన 228 ఆటగాళ్లు కాగా, విదేశీ ఆటగాళ్లు 123 మంది ఉన్నారు. ప్రాంఛైజీలు తమకు నచ్చిన ఆటగాళ్లను కొనుగోలు చేయొచ్చని ఆయన తెలిపారు.

Dec 18, 2018, 3:33 pm IST

ఐపీఎల్ వేలం సందర్భంగా ముంబైకి చెందిన శివమ్ దుబే ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతున్నాడు. ఈ వేలంలో శివమ్ దుబేని ప్రాంఛైజీలు భారీ ధరకు కొనుగోలు చేసే అవకాశం లేకపోలేదు. సోమవారం జరిగిన రంజీ మ్యాచ్‌లో శివమ్ దుబే 5 బంతుల్లో 5 సిక్సులు బాదాడు.

Dec 18, 2018, 3:29 pm IST

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోని మొత్తం ఆటగాళ్లు: 15; Indian 10, Overseas 5 అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు: Shreyas Iyer, Rishabh Pant, Prithvi Shaw, Amit Mishra, Avesh Khan, Harshal Patel, Rahul Tewatia, Jayant Yadav, Manjot Kalra, Colin Munro, Chris Morris, Kagiso Rabada, Sandeep Lamichhane, Trent Boult మిగిలిన స్లాట్స్: 10; Indian 7, Overseas 3 ఫ్రాంఛైజీ వద్ద మిగిలిన నగదు: Rs 25.50 Crores

Dec 18, 2018, 3:18 pm IST
Mykhel

ఐపీఎల్ వేలానికి ముందు ఎనిమిది ప్రాంఛైజీలు అట్టిపెట్టుకున్న ఆటగాళ్లతో పాటు ప్రాంఛైజీ వద్ద ఉన్న నగదు వివరాలివే

Dec 18, 2018, 3:06 pm IST
Mykhel

ఐపీఎల్ 2019 వేలానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను నిర్వాహాకులు పూర్తి చేశారు. ఆక్షనర్ వేలం నిర్వహించే స్టేజి ఇదే. ఈరోజు వేలంలో ఆటగాళ్లు మొత్తం 70 మంది ఆటగాళ్లను ఎంపిక చేసుకోనున్నారు.

Dec 18, 2018, 2:14 pm IST

ఐపీఎల్ 2019 వేలానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను నిర్వాహాకులు పూర్తి చేశారు. ఈ వేలం జైపూర్ వేదికగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ వేలానికి సంబంధించి ఎప్పటికప్పుడు తాజా వార్తలను మైఖేల్ తెలుగులో చదవండి

Dec 18, 2018, 1:28 pm IST

ఐపీఎల్ 2019 వేలానికి సర్వం సిద్ధం

Dec 18, 2018, 1:25 pm IST
Mykhel

మనన్ వోహ్రాపై కన్నేసిన చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్తుత వేలంలో రూ. 20 లక్షల కనీసధరతో ఉన్న మనన్ వోహ్రాపై డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ కన్నేసింది. 2014 ఐపీఎల్ సీజన్‌లో మనన్ వోహ్రా కోల్‌కతా నైట్ రైడర్స్ తరుపున ఫైనల్లో 52 బంతుల్లో 67 పరుగులతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఆ ఎడిషన్‌లో మనన్ వోహ్రా 8 ఇన్నింగ్స్‌ల్లో 324 పరుగులు చేశాడు. స్ట్రయిక్ రేట్‌ 139.05గా ఉంది.

Dec 18, 2018, 12:44 pm IST
Mykhel

వేలంలో అందకి కళ్లు యువీపైనే! భారత క్రికెట్‌లో ఓ వెలుగు వెలిగిన స్టార్‌ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ ప్రస్తుతం ఫామ్‌లో లేక గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నాడు. యువీని ఈసారి వేలంలో ఎవరైనా కొంటారా.. లేదా? అనే చర్చ విస్తృతంగా సాగుతోంది. ఐపీఎల్‌లో ఒకానొక సమయంలో గరిష్ఠంగా రూ.16 కోట్లు పలికిన యువీ.. తాజా వేలంలో కనీస ధర రూ. కోటికి పడిపోయాడు. గత ఐపీఎల్‌లో పంజాబ్‌ తరఫున యువరాజ్‌ 8 మ్యాచ్‌ల్లో 65 పరుగులే చేశాడు. దీంతో ఆ జట్టు యువీని వదులుకుంది. ప్రస్తుత వేలంలో యువరాజ్ రూ.కోటి కనీసధరతో ఉన్నాడు.

Dec 18, 2018, 11:33 am IST

ఐపీఎల్ 2019 వేలంపై కొత్త ఆక్షనర్ హ్యూస్‌ ఎడ్‌మెయిడాస్‌ స్పందన ఇదీ..

Dec 18, 2018, 11:07 am IST

ప్రపంచవ్యాప్తంగా 1,003 మంది క్రికెటర్లు వేలంలో పాల్గొనడానికి ధరఖాస్తు చేసుకోగా ప్రాంచైజీల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ 350 మందితో కూడిన తుది జాబితాను ప్రకటించింది. 118 మంది జాతీయ జట్లకు ఆడిన క్రికెట‌ర్లు, 228 మంది దేశవాళీ ఆటగాళ్లు వేలంలో పాల్గొనబోతున్నారు. ఇందులో ఎనిమిది ప్రాంఛైజీలు కలిపి 70 మంది క్రికెటర్లను వేలంలో ఫ్రాంఛైజీలు కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది. ఈ వేలంలో 70 మంది ఆటగాళ్లకు అవకాశం ఉంది. అందులో 20 విదేశీ ఆటగాళ్లకు కేటాయించారు. అత్యధిక కనీస ధర రూ.2 కోట్ల జాబితాలో భారత ఆటగాడు ఒక్కరు కూడా లేరు.

Dec 18, 2018, 11:06 am IST

విదేశీ ఆటగాళ్లు మెక్‌కలమ్‌, క్రిస్‌ వోక్స్‌, మలింగ, షాన్‌ మార్ష్‌, కొలిన్‌ ఇంగ్రామ్‌, కోరె అండర్సన్‌, ఏంజెలో మాథ్యూస్‌, సామ్‌ కరన్‌, షార్ట్‌ తమ కనీస ధరను రూ.2 కోట్ల‌తో వేలంలో పాల్గొన‌బోతున్నారు. ఇక, భారత క్రికెటర్లలో ఇషాంత్‌ శర్మ, వికెట్ కీప‌ర్ బ్యాట్స్‌మ‌న్ నమన్‌ ఓజా కనీస ధర రూ.75 లక్షలు కాగా.. పుజారా, మనోజ్‌ తివారి, హనుమ విహారి, గుర్‌కీరత్‌ సింగ్‌, మోహిత్‌ శర్మ కనీస ధర రూ.50 లక్షల ధరతో వేలంలో ఉన్నారు.

Dec 18, 2018, 11:06 am IST

ఫ్రాంచైజీల విషయానికి వస్తే పంజాబ్‌ వద్ద అత్యధికంగా రూ.36.20 కోట్లు ఉన్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్‌‌ (రూ.25.50 కోట్లు), రాజస్థాన్‌ రాయల్స్‌ (రూ.20.95 కోట్లు), బెంగళూరు (రూ.18.15 కోట్లు), కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (రూ.15.20 కోట్లు), ముంబై ఇండియన్స్‌ (రూ.11.15 కోట్లు), సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (రూ.9.70 కోట్లు), చెన్నై సూపర్‌ కింగ్స్‌ (రూ.8.40 కోట్లు) వేలంలో ఖర్చు చేసేందుకు అవకాశముంది.

Dec 18, 2018, 11:05 am IST

ప్రపంచవ్యాప్తంగా 1,003 మంది క్రికెటర్లు వేలంలో పాల్గొనడానికి ధరఖాస్తు చేసుకోగా ప్రాంచైజీల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ 350 మందితో కూడిన తుది జాబితాను ప్రకటించింది. 118 మంది జాతీయ జట్లకు ఆడిన క్రికెట‌ర్లు, 228 మంది దేశవాళీ ఆటగాళ్లు వేలంలో పాల్గొనబోతున్నారు. ఇందులో ఎనిమిది ప్రాంఛైజీలు కలిపి 70 మంది క్రికెటర్లను వేలంలో ఫ్రాంఛైజీలు కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది. ఈ వేలంలో 70 మంది ఆటగాళ్లకు అవకాశం ఉంది. అందులో 20 విదేశీ ఆటగాళ్లకు కేటాయించారు. అత్యధిక కనీస ధర రూ.2 కోట్ల జాబితాలో భారత ఆటగాడు ఒక్కరు కూడా లేరు. విదేశీ ఆటగాళ్లు మెక్‌కలమ్‌, క్రిస్‌ వోక్స్‌, మలింగ, షాన్‌ మార్ష్‌, కొలిన్‌ ఇంగ్రామ్‌, కోరె అండర్సన్‌, ఏంజెలో మాథ్యూస్‌, సామ్‌ కరన్‌, షార్ట్‌ తమ కనీస ధరను రూ.2 కోట్ల‌తో వేలంలో పాల్గొన‌బోతున్నారు. ఇక, భారత క్రికెటర్లలో ఇషాంత్‌ శర్మ, వికెట్ కీప‌ర్ బ్యాట్స్‌మ‌న్ నమన్‌ ఓజా కనీస ధర రూ.75 లక్షలు కాగా.. పుజారా, మనోజ్‌ తివారి, హనుమ విహారి, గుర్‌కీరత్‌ సింగ్‌, మోహిత్‌ శర్మ కనీస ధర రూ.50 లక్షల ధరతో వేలంలో ఉన్నారు. ఫ్రాంచైజీల విషయానికి వస్తే పంజాబ్‌ వద్ద అత్యధికంగా రూ.36.20 కోట్లు ఉన్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్‌‌ (రూ.25.50 కోట్లు), రాజస్థాన్‌ రాయల్స్‌ (రూ.20.95 కోట్లు), బెంగళూరు (రూ.18.15 కోట్లు), కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (రూ.15.20 కోట్లు), ముంబై ఇండియన్స్‌ (రూ.11.15 కోట్లు), సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (రూ.9.70 కోట్లు), చెన్నై సూపర్‌ కింగ్స్‌ (రూ.8.40 కోట్లు) వేలంలో ఖర్చు చేసేందుకు అవకాశముంది.

Dec 18, 2018, 10:55 am IST

ఐపీఎల్ 2019 వేలానికి సంబంధించిన పూర్తి వివరాలను ప్రాంఛైజీ నిర్వాహాకులకు వెల్లడిస్తోన్న బీసీసీఐ పాలకుల కమిటీ సభ్యులు.

Dec 18, 2018, 10:50 am IST

ఐపీఎల్ 2019 సీజన్ వేలానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అన్ని ప్రాంఛైజీల నిర్వాహాకులకు వివరిస్తోన్న బీసీసీఐ పాలకుల కమిటి సభ్యులు.

Story first published: Wednesday, December 19, 2018, 9:19 [IST]
Other articles published on Dec 19, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+