కెప్టెన్గా ఎంఎస్ ధోనీ:
ఓపెనర్లుగా కేఎల్ రాహుల్, డేవిడ్ వార్నర్లను ఎంచుకున్నాడు. రాహుల్ పంజాబ్ తరపున, వార్నర్ హైదరాబాద్ తరపున పరుగుల వరద పారించిన విషయం తెలిసిందే. వన్ డౌన్ బ్యాట్స్మన్గా ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ను తీసుకున్నాడు. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మన్లుగా ఎంఎస్ ధోనీ (చెన్నై), రిషబ్ పంత్ (ఢిల్లీ)లకు అవకాశం ఇచ్చాడు. ఈ ఇద్దరూ వికెట్ కీపర్లే అయినా.. కుంబ్లే తన జట్టుకు ధోనీని కీపర్గా ఎంచుకున్నాడు.
ఆల్రౌండర్లకు అవకాశం:
అనిల్ కుంబ్లే తన జట్టులో ఇద్దరు ఆల్రౌండర్లకు అవకాశం ఇచ్చాడు. ప్రస్తుత సీజన్-12లో బౌలర్లపై కనికరం లేకుండా బంతులను స్టాండ్స్ లోకి తరలిస్తున్న భారీ హిట్టర్లు ఆండ్రీ రసెల్ (కలకత్తా), హార్దిక్ పాండ్యా (ముంబై)లను తీసుకున్నాడు. ఇక ఇద్దరు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లకు జట్టులో చోటు కల్పించాడు. స్పిన్ విభాగంలో ఇమ్రాన్ తాహిర్ (చెన్నై), శ్రేయాస్ గోపాల్ (రాజస్థాన్).. పేస్ విభాగంలో రబడ (ఢిల్లీ), బుమ్రా (ముంబై)లు చోటు దక్కించుకున్నారు.
కుంబ్లే జట్టు:
కేఎల్ రాహుల్, డేవిడ్ వార్నర్, శ్రేయాస్ అయ్యర్, ఎంఎస్ ధోనీ (కెప్టెన్/కీపర్), రిషబ్ పంత్, ఆండ్రీ రసెల్, హార్దిక్ పాండ్యా, ఇమ్రాన్ తాహిర్, శ్రేయాస్ గోపాల్, కాగిసో రబడ, జస్ప్రీత్ బుమ్రా.