ఎంగిడి రాకతో చెన్నై జట్టుకు మరింత బలం
లుంగీ ఎంగిడి జట్టులో చేరడంతో చెన్నై జట్టుకు మరింత బలం చేకూరినట్లైంది. ఇప్పటికే ఫూణె స్టేడియంలో లుంగీ ఎంగిడి ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఏప్రిల్ 13న లుంగి తండ్రి జీరోమ్ ఎంగిడి మరణించాడు. దీంతో టోర్నీ ఆరంభమైన కొద్ది రోజులుకే లుంగీ ఎంగిడి స్వదేశానికి పయనమయ్యాడు.
ఐపీఎల్ మొత్తానికి దూరమవుతాడనే వార్తలు
దీంతో అతడు మొత్తం ఐపీఎల్ సీజన్కే దూరమవుతాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ అలా జరగలేదు. ఈ ఏడాది ఆరంభంలో భారత్-దక్షిణాఫ్రికా పర్యటనలో లుంగీ ఎంగిడి అద్భుత ప్రదర్శన కనబర్చాడు. సఫారీ గడ్డపై టెస్టు సిరీస్ గెలవాలనుకున్న కోహ్లీసేన ఆశలపై నీళ్లు చల్లాడు. అంతేకాదు మూడు టెస్టు మ్యాచ్ల సిరిస్ను 2-1తో దక్షిణాఫ్రికా గెలుచుకోవడంలో కూడా ఎంగిడి కీలకపాత్ర పోషించాడు.
వేలంలో రూ. 50 లక్షలకు దక్కించుకున్న చెన్నై
ఈ ప్రదర్శనను చూసే ఈ ఏడాది జనవరిలో బెంగళూరు వేదికగా జరిగిన ఐపీఎల్ వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ వేలంలో రూ. 50 లక్షలకు చెన్నై ప్రాంఛైజీ కొనుగోలు చేసింది. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు టోర్నీలో ఆరు మ్యాచ్లాడిన చెన్నై కేవలం ఒకే ఒక మ్యాచ్లో మాత్రమే ఓడిపోయింది. ఐదు విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
ఆరంభ మ్యాచ్లో చెన్నై ఘన విజయం
ఈ సీజన్లో ఇప్పటికే ఈ రెండు జట్లు ఒకసారి తలపడ్డాయి. ఐపీఎల్ 11వ సీజన్ ఆరంభ మ్యాచ్లో ఈ రెండు జట్లు తలపడగా చెన్నై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. శనివారం జరిగే మ్యాచ్లో ముంబై గెలిచి ప్రతీకారం తీర్చుకుంటుందో లేదో తెలియాలంటే ఇంకొన్ని గంటలు ఆగాల్సిందే.