బెంగళూరు-చెన్న మ్యాచ్లో ఊహించని సంఘటన
ఇదంతా ధోని వల్లే. ధోని ఆ జట్టుకు కెప్టెన్గా ఉండటం కూడా చెన్నైకి అభిమానులు సంఖ్య ఎక్కువగా ఉన్నారనడంలో ఎటువంటి సందేహాం లేదు. ఐపీఎల్లో మిగతా జట్లకు చెందిన అభిమానులు సైతం ధోనిని ఎంతగా ప్రేమిస్తారనే దానికి ఈ సంఘటనే ఓ చిన్న ఉదాహరణ. ఐపీఎల్ టోర్నీలో భాగంగా బుధవారం రాత్రి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది.
చెన్నై విజయ లక్ష్యం 206 పరుగులు
ఈ మ్యాచ్లో అప్పటివరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుని ఉత్సాహపరిచిన ఓ అభిమాని ధోని క్రీజులోకి రాగానే చెన్నై జట్టుని ఉత్సాహపరచడం ప్రారంభించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. అనంతరం క్రీజులోకి చెన్నైకి ఓపెనర్లు చక్కటి శుభారంభాన్ని ఇవ్వలేకపోయారు.
జడేజా ఔటైన తర్వాత క్రీజులోకి ధోని
తొలి ఓవర్లోనే ఓపెనర్ వాట్సన్ (7) వికెట్ని కోల్పోయిన చెన్నై.. ఆ తర్వాత హిట్టర్ సురేశ్ రైనా (11), శామ్ బిల్లింగ్స్ (9), రవీంద్ర జడేజా(3) వికెట్లని చేజార్చుకుంది. జడేజా ఔటైన తర్వాత క్రీజులోకి ధోని వచ్చాడు. ధోని క్రీజులోకి రాగానే అప్పటివరకు బెంగళూరుకి మద్దతు పలికిన ఓ మహిళ అభిమాని అమాంతం చెన్నైకి మద్దతు పలికింది.
|
బెంగళూరు జెర్సీని తీసేసి గాల్లోకి ఊపుతూ
అంతేకాదు అప్పటివరకు తాను ధరించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జెర్సీని తీసేసి గాల్లోకి ఊపుతూ ధోని... ధోని... అంటూ పెద్దగా ఉత్సాహపరిచింది. ఇక్కడ విశేషం ఏమిటంటే ఆమె వేసుకున్న బెంగళూరు జెర్సీ కింద చెన్నై సూపర్ కింగ్స్ ఉండటం. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.