లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో జరిగిన వన్డేలో భారత ఆల్రౌండర్ దీప్తి శర్మ ఇంగ్లండ్కు చెందిన చార్లీ డీన్ను నాన్స్ట్రైకర్స్ ఎండ్లో రనౌట్ చేసినప్పటి నుంచి దీనిపై చర్చ జరుగుతుంది. ఇది సరైందేనని కొందరు.. సరికాదని మరికొందర్ అభిప్రాయపడ్డారు.బౌలర్ బంతిలో బంతి ఉండి.. నాన్-స్ట్రైకర్ క్రీజు దాటితే అతన్ని రన్ అవుట్ చేయడం ఖచ్చితంగా చట్టబద్ధమైనదని కొందరు అన్నారు. అయితే ఈ టీ20 వరల్డ్ నుంచి ఇలా ఔట్ చేయ్యొచ్చని.. దీన్ని ఔట్ గా ప్రకటించవచ్చని ఐసీసీ ఇప్పటికే ప్రకటించింది.
ఇది చట్టబద్ధమైనది
తాజాగా దీనిపై భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరోసారి స్పందించాడు. జింబాబ్వేతో భారత్ టీ20 ప్రపంచకప్ సూపర్ 12 మ్యాచ్కు ముందు రవిచంద్రన్ అశ్విన్ విలేకరుల సమావేశంలో మాట్లాడాడు. నాన్ స్ట్రైక్ ఎండ్ రన్ ఔట్ పై విలేకరులు ప్రశ్నించారు. "ఇది చట్టబద్ధమైనది. దానికి సంబంధించి అనేక వాదనలు ఉన్నాయి. ఈ ప్రపంచంలో ప్రజలు విరుద్ధమైన ఆలోచనలను కలిగి ఉంటారు. మీరు దీన్ని చేయాలనుకున్నా లేదా చేయకపోయినా, ఇది ఖచ్చితంగా మంచిది. కొంతమంది చేయరు అని తెలుసుకోవడం మంచిది" అని అశ్విన్ అన్నాడు.
బంగ్లాదేశ్, పాకిస్తాన్
"మేము ఇక్కడికి సులభంగా చేరుకోలేదు. మేము బంగ్లాదేశ్, పాకిస్తాన్తో ఉత్కంఠ పోరులో గెలిచాం. ఈ మ్యాచ్ తుది దశకు చేరుకున్నాయి" అని చెప్పాడు. జింబాబ్వేతో జరగబోయే మ్యాచ్ లో మంచిగా గెలుస్తామని చెప్పాడు.