ప్రపంచ కప్ ఆడేందుకు భారత అంధుల జట్టుకు అనుమతివ్వరూ..

హైదరాబాద్: ప్రపంచ కప్లో పోరాడాలని ఉవ్విల్లూరుతున్న భారత అంధుల జట్టుకు దేశం వదలి వెళ్లేందుకు విదేశీ వ్యవహారాల శాఖ అనుమతివ్వట్లేదు. ఈ ప్రపంచ కప్ కోసం పాకిస్థాన్లో రెండు మ్యాచ్లు ఆడాల్సి ఉంది.
దీనికి సంబంధించిన అనుమతి లభించకపోవడంతో జట్టు ఇంకా స్వదేశంలోనే ఆగిపోయింది. ఇదిలా ఉంటే పాకిస్థాన్ అంధుల క్రికెట్ బోర్డు జరగాల్సిన మ్యాచ్లను దుబాయ్కు తరలించింది. ముందుగా భారత అంధుల జట్టు పాకిస్థాన్తో లాహోర్లోని గద్దఫీ వేదికగా జనవరి 7 నుంచి జరగాల్సిన మొదటి మ్యాచ్ను ఆడదలచింది.
వేదికలో మార్పులు జరగడంతో అదే రోజు దుబాయ్లోని అజ్మన్ వేదికగా ఆస్ట్రేలియాతో మొదటి మ్యాచ్ను ఆడేందుకు సిద్ధమైంది. పాక్కు వెళ్లి ఆడాలంటే కేంద్రం అనుమతి తప్పనిసరనీ, ఈ విషయంపై కేంద్రం ఈనెల 5న నిర్ణయాన్ని ప్రకటించే అవకాశ ముందని భారత అంధుల క్రికెట్ సంఘం చీఫ్ మహంతేశ్ తెలిపారు.
జనవరి 21న జరగాల్సిన ఫైనల్ మ్యాచ్ను లాహోర్ వేదికగా జరుగుతుంది. ఒకవేళ భారత ఫైనల్కు వెళితే జనవరి 19వ తేదీనే దుబాయ్లోని షార్జాలోనే మ్యాచ్ ఆడనుంది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications