స్మిత్.. వార్నర్ లేకపోవడమే మంచి సమయం
కోహ్లీసేన ఆస్ట్రేలియాలో నాలుగు టెస్టులు, మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. డిసెంబర్ 6న అడిలైడ్లో తొలి టెస్టు ప్రారంభం అవుతుంది. ‘విరాట్ కోహ్లీ పరుగుల దాహంతో ఉన్నాడు. అది మంచిదే. అతడినలా చూడడం బాగుంది. విరాట్ పని విలువలు, మైదానంలో తన వైఖరితో 110 శాతం న్యాయం చేస్తున్నాడు. అతడిలోని పరుగుల దాహమే నాకిష్టం' అని కాంబ్లి అన్నాడు.
ఆస్ట్రేలియా సిరీస్ను గెలవబోతున్నాం
‘మన అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. కొద్ది రోజుల్లో మొదలుకాబోయే ఆస్ట్రేలియా సిరీస్ను మనమే గెలవబోతున్నాం. ఆస్ట్రేలియా జాతీయ జట్టుకు స్మిత్, వార్నర్ అందుబాటులో లేరు. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి' అని కాంబ్లి పిలుపునిచ్చాడు. బాల్ ట్యాంపరింగ్కు పాల్పడటంతో వీరిద్దరిని క్రికెట్ ఆస్ట్రేలియా ఏడాది కాలం నిషేధించింది. దీంతో వారు దేశీవాలీ లీగ్లు ఆడుతూ జట్టుకు దూరంగా ఉన్నారు.
సచిన్ కూడా అదే మాట:
ఆస్ట్రేలియా పర్యటనను ఉద్దేశించి సచిన్ టెండూల్కర్ కూడా కోహ్లీకి కొన్ని సూచనలిచ్చాడు. కొద్ది రోజుల ముందు మీడియాతో మాట్లాడిన సచిన్.. స్మిత్, వార్నర్ లేకపోవడం టీమిండియాకు మరింత కలిసొస్తుంది. ఫామ్లో ఉన్న టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనను విజయవంతంగా ముగిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపాడు.
సహజశైలిలోనే ఆడితేనే షాకు మంచిది.
అరంగేట్రంలోనే సెంచరీలతో ఆకట్టుకున్న యువ సంచలనం పృథ్వీషాపై కాంబ్లి ప్రశంసలతో కూడిన సూచనలు ఇచ్చాడు. ‘అతడు స్ట్రోక్ ప్లేయర్. బంతిని ఆలస్యంగా ఆడి పరుగులు చేయడం ఇష్టపడతాడు. అతనికి సరిపోయే షాట్లు ఆడేందుకు ఇష్టపడతాడు. సహజశైలిలోనే ఆడితే షాకు మంచిది. నేనెప్పుడూ అతడికిదే చెప్తాను. అతిగా ఆలోచించొద్దు. ఆటను ఆస్వాదించు. ఆత్మవిశ్వాసంతో ఉండు. ఆస్ట్రేలియాలాంటి పర్యటనలకు వెళ్లినప్పుడు ఇదే కీలకం' అని కాంబ్లి తెలిపాడు.