కార్పొరేట్ బాక్స్ ధర రూ.7 వేలు
సౌత్ పెవిలియన్ కార్పొరేట్ బాక్స్ ధర రూ.7 వేలు, వెస్ట్ స్టాండ్ కార్పొరేట్ బాక్స్ ధర రూ. 4 వేలుగా సౌరాష్ట్ర క్రికెట్ అసోషియేషన్ (ఎస్సీఏ) నిర్ణయించింది. స్టేడియంతో పాటు రాజ్ కోట్ సిటీలో మొత్తం ఐదు చోట్ల టికెట్ విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు
ఈ టికెట్లను ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు క్రికెట్ అభిమానులు కొనుగోలు చేయొచ్చు. భారత పర్యటనలో భాగంగా వెస్టిండిస్ జట్టు రెండు టెస్టులు, ఐదు వన్డేలు, మూడు టీ20ల సిరిస్ ఆడనుంది. అక్టోబరు 4 నుంచి రాజ్కోట్ వేదికగా తొలి టెస్టు ప్రారంభంకానుంది.
అనంతరం 12 నుంచి హైదరాబాద్లో రెండో టెస్టు
అనంతరం 12 నుంచి 16 వరకు హైదరాబాద్ వేదికగా రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. రాజ్కోట్లో ఇప్పటి వరకు కేవలం ఒక అంతర్జాతీయ టెస్టు మ్యాచ్ మాత్రమే జరిగింది. 2016లో ఈ స్టేడియం భారత్-ఇంగ్లాండ్ మ్యాచ్కి ఆతిథ్యమిచ్చింది. టెస్టు సిరిస్ అనంతరం అక్టోబర్ 21 నుంచి వన్డే సిరిస్ ప్రారంభం కానుండగా, ఆ తర్వాత టీ20 సిరిస్ ప్రారంభం అవుతుంది.
ఆసియా కప్లో బిజీగా ఉన్న భారత్
ప్రస్తుతం యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియా కప్లో భారత్ ఆడుతోంది. ఈ ఆసియా కప్ టోర్నీ సెప్టెంబర్ 28తో ముగియనుంది. అనంతరం వెస్టిండీస్తో భారత్ జట్టు రెండు టెస్టులు, ఐదు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్ల సుదీర్ఘ సిరీస్ ఆడనుంది.