ఆదిలోనే షాక్
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు విండీస్ బౌలర్ షెల్డాన్ కాట్రెల్ ఆదిలోనే షాక్ ఇచ్చాడు. ఏడో ఓవర్ మూడో బంతికి ఓపెనర్ కేఎల్ రాహుల్ (6) పెవిలియన్ చేరాడు. బంతిని అంచనా వేయడంలో విఫలమయిన రాహుల్.. షిమ్రాన్ హెట్మెయిర్కు క్యాచ్ ఇచ్చాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ (4) కూడా త్వరగానే పెవిలియన్ చేరాడు. ఓ బౌండరీ బాది జోరుమీద కనిపించిన కోహ్లీ బోల్డ్ అయ్యాడు. ఏడో ఓవర్ చివరి బంతి కోహ్లీ బ్యాట్ ఎడ్జ్ తీసుకుని వికెట్లను గిరాటేసింది. దీంతో కీలక రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియా కష్టాలో పడింది.
పంత్ ధనాధన్
అయితే మరో ఓపెనర్ రోహిత్ శర్మ యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్తో కలిసి ఇన్నింగ్స్ను గాడిలో పెట్టాడు. ఆరు ఫోర్లతో మంచి జోరుమీదున్న రోహిత్.. పోలార్డ్ చేతికి చిక్కాడు. జోసెఫ్ బౌలింగ్లో రోహిత్ (36) పెవిలియన్ బాట పట్టాడు. రోహిత్ ఔటైన తర్వాత ఇన్నింగ్స్ను ముందుండి నడిపించే బాధ్యతను అయ్యర్ తీసుకున్నాడు. ఆరంభంలో నిదానంగా ఆడిన అతడు కుదురుకున్నాక జోరు పెంచాడు. మరోవైపు రిషబ్ పంత్ ధనాధన్ బ్యాటింగ్తో అలరించాడు.
హఫ్ సెంచరీలు
ఈ క్రమంలోనే నిలకడగా ఆడుతున్న శ్రేయాస్ హఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వన్డేల్లో అతనికిది ఐదో హాఫ్సెంచరీ కావడం విశేషం. అయ్యర్ సహకారంతో బౌండరీలతో రెచ్చిపోయిన పంత్ కూడా హఫ్ సెంచరీ చేసాడు. వన్డే కెరీర్లో పంత్కిదే తొలి అర్ధ శతకం. వరుస వైఫల్యాలపై విమర్శలు ఎదుర్కొంటున్న పంత్.. ఓ మంచి ఇన్నింగ్స్ ఆడాడు. అయితే ధాటిగా ఆడే క్రమంలో అయ్యర్ (70)పెవిలియన్ చేరాడు. 38 ఓవర్లు ముగిసేసరికి భారత్ 4 వికెట్లకు 199 పరుగులు చేసింది. క్రీజులో పంత్ (63), కేదార్ జాదవ్ (3) ఉన్నారు. విండీస్ బౌలర్లలో కాట్రెల్, జోసఫ్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు.