
1997లో పోర్ట్ ఆఫ్ స్పెయిన్లో
1997లో పోర్ట్ ఆఫ్ స్పెయిన్లో భారత్తో జరిగిన మ్యాచ్లో విండీస్ 121 పరుగులకే ఆలౌటైంది. ఇది ఇప్పటివరకూ భారత్పై విండీస్కు అత్యల్ప స్కోరు కాగా, తాజాగా ఆ చెత్త రికార్డుని వెస్టిండిస్ సవరించింది. ఈ మ్యాచ్లో భారత బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా నాలుగు వికెట్లు తీయగా, బూమ్రా, ఖలీల్ అహ్మద్లు తలో రెండు వికెట్లు తీశారు.

తొలి మూడు వన్డేల్లో 926 పరుగులు చేసిన వెస్టిండిస్
భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్లకు చెరో వికెట్ లభించింది. ఈ సిరిస్లో తొలి మూడు వన్డేల్లో వెస్టిండీస్ 38.58 సగటుతో 926 పరుగులు చేసిన వెస్టిండిస్ జట్టు చివరి రెండు వన్డేల్లో మాత్రం 12.85 సగటుతో 257 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇక, వికెట్ల విషయానికి వస్తే తొలి మూడు వన్డేల్లో 24 వికెట్లు కోల్పోగా... ఆఖరి రెండు మ్యాచుల్లో 20 వికెట్లు చేజార్చుకుంది.
వన్డేల్లో భారత్పై విండీస్ అతి తక్కువ స్కోర్లు:
104 తిరువనంతపురం, 2018
121 పోర్ట్ ఆఫ్ స్పెయిన్, 1997
123 కోల్కతా, 1993
126 పెర్త్, 1991
129 జోహన్నెస్బర్గ్, 2009


Click it and Unblock the Notifications












