మన ఆలోచన విధానంపై
"మన ఆలోచన విధానంపై ఇది ఆధారపడి ఉంటుంది. టీ20 వరల్డ్కప్కు ముందు ఈ మ్యాచ్ ఎంతో ప్రేరణగా నిలుస్తుంది. టీ20ల్లో విశ్రాంతి తీసుకున్న తర్వాత ఇలా రాణించడం ఎంతో గొప్పగా ఉంది. మైదానంలో సరైన ప్లాన్ను అమలు చేయడం ఎంతో కీలకం. రోహిత్, రాహుల్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు" అని కోహ్లీ కొనియాడాడు.
బ్యాటింగ్ అనగానే కొద్దిగా ఆలోచించాం
"తొలుత బ్యాటింగ్ అనగానే కొద్దిగా ఆలోచించాం. కానీ పిచ్ మాకు సహకరించింది. పిచ్, మైదానాన్ని బట్టి ఎలా ఆడాలో మనం నిర్ణయించుకోవాలి. వచ్చే ఏడాది ప్రపంచకప్ ఆస్ట్రేలియాలో జరగనుంది. అక్కడ పెద్ద బౌండరీలు ఉంటాయని మనం గుర్తించాలి" అని విరాట్ కోహ్లీ వెల్లడించాడు.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్
ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు భారత జట్టులో రోహిత్ శర్మ (34 బంతుల్లో 71), కేఎల్ రాహుల్ (56 బంతుల్లో 91) రాణించడంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 240 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన విండిస్ 8 వికెట్లు కోల్పోయి 173 పరుగులకే పరిమితమైంది.
|
2-1తో సిరిస్ కైవసం
దీంతో టీమిండియా మూడు టీ20ల సిరిస్ను 2-1తో కైవసం చేసుకుంది. అంతకముందు హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టీ20లో టీమిండియా విజయం సాధించగా... తిరువనంతపురం వేదికగా జరిగిన రెండో టీ20లో వెస్టిండిస్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. మూడు వన్డేల సిరీస్లో భాగంగా తొలి వన్డే చెన్నై వేదికగా ఆదివారం జరగనుంది.