ఇషాంత్ శర్మ మరో వికెట్ తీస్తే
ఈ టెస్టులో టీమిండియా పేసర్ ఇషాంత్ శర్మ మరో వికెట్ తీస్తే మాజీ క్రికెట్ దిగ్గజం కపిల్దేవ్ రికార్డును అధిగమిస్తాడు. ఉపఖండం బయట టెస్టుల్లో అత్యధిక టెస్టు వికెట్లు తీసిన రెండో భారత బౌలర్గా నిలుస్తాడు. ఉపఖండం బయట ఇషాంత్ శర్మ ఇప్పటివరకు 45 వికెట్లతో కపిల్ దేవ్ సరసన నిలిచాడు.
50 వికెట్లతో అగ్రస్థానంలో కుంబ్లే
ఈ జాబితాలో భారత క్రికెట్ జట్టు తరుపున టీమిండియా మాజీ హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే 50 వికెట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఆంటిగ్వా వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇషాంత్ శర్మ ఎనిమిది వికెట్లతో అద్భుత ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. తొలి ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు తీసిన ఇషాంత్, రెండో ఇన్నింగ్స్లో మూడు వికెట్లు తీశాడు.
318 పరుగుల తేడాతో విజయం
తొలి టెస్టులో టీమిండియా 318 పరుగుల తేడాతో విజయం సాధించడంలో ఇషాంత్ శర్మ కీలకపాత్ర పోషించాడు. నెలరోజుల సుదీర్ఘ వెస్టిండిస్ పర్యటనలో కోహ్లీసేనకు ఇదే ఆఖరి మ్యాచ్ కావడం విశేషం. ఈ టెస్టుతో టీమిండియా వెస్టిండిస్ పర్యటన ముగుస్తుంది. ఈ పర్యటనలో భాగంగా తొలుత జరిగిన టీ20 సిరిస్ను 3-0తో టీమిండియా కైవసం చేసుకుంది.
ధోని రికార్డుని బద్దలు కొట్టనున్న కోహ్లీ
ఆ తర్వాత జరిగిన వన్డే సిరిస్ను 2-0తో సొంతం చేసుకుంది. ఇప్పుడు రెండు టెస్టు మ్యాచ్ల సిరిస్పై టీమిండియా కన్నేసింది. రెండో టెస్టులో కూడా టీమిండియా గెలిస్తే కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనతను సాధిస్తాడు. కెప్టెన్గా ధోనికి ఇది 28వ విజయం అవుతుంది. ఈ క్రమంలో ఇప్పటివరకూ ధోని పేరిట ఉన్న 27 మ్యాచ్ల రికార్డును కోహ్లీ బద్దలు కొడతాడు.