|
రోస్టన్ ఛేజ్ వికెట్ తీయడం ద్వారా
ఈ టెస్టులో రోస్టన్ ఛేజ్ వికెట్ తీయడం ద్వారా ఉమేశ్ యాదవ్ టెస్టుల్లో రెండోసారి ఐదు వికెట్లను తీసుకున్నాడు. చివరి మూడు వికెట్లు ఉమేశ్ యాదవ్ సాధించడం మరో విశేషం. దీంతో రెండో రోజు మ్యాచ్ ప్రారంభమైన కొద్ది సేపటికే వెస్టిండిస్ జట్టు ఆలౌటైంది. భారత బౌలర్లలో ఉమేశ్ యాదవ్ 6 వికెట్లు తీయగా.. కుల్దీప్ యాదవ్ మూడు, అశ్విన్ ఒక వికెట్ తీసుకున్నారు.
|
తన టెస్టు కెరీర్లో అత్యుత్తమ గణాంకాలు
ఈ టెస్టులో ఉమేశ్ యాదవ్ తన టెస్టు కెరీర్లో అత్యుత్తమ గణాంకాలను నమోదు చేశాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో ఆరు వికెట్లు సాధించడం ద్వారా ఒక ఇన్నింగ్స్లో అత్యధిక వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అంతకుముందు ఉమేశ్ యాదవ్ ఒక ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు మాత్రమే అత్యుత్తమం కాగా, దాన్ని తాజాగా సవరించాడు.
ఈ వేదికలో అత్యుత్తమ గణాంకాలను నమోదు చేసిన తొలి పేసర్
మరొకవైపు స్వదేశంలో ఒక భారత పేసర్ నమోదు చేసిన 13వ అత్యుత్తమ బౌలింగ్గా ఇది నిలిచింది. కాగా, ఈ వేదికలో అత్యుత్తమ గణాంకాలను నమోదు చేసిన తొలి పేసర్గా ఉమేశ్ నిలిచాడు. గతంలో జహీర్ఖాన్ (4/69) ప్రదర్శన ఇప్పటివరకూ ఇక్కడ అత్యుత్తమం కాగా, ఇప్పుడు దానిని ఉమేశ్ యాదవ్ అధిగమించాడు.