
36.2 ఓవర్లలో 153 పరుగులకే కుప్పకూలిన వెస్టిండీస్
అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన వెస్టిండీస్ జట్టు 36.2 ఓవర్లలో 153 పరుగులకే పేలవరీతిలో కుప్పకూలిపోయింది. ఛేదన ఆరంభంలోనే ఓపెనర్ కీరన్ పొవెల్ (4), షై హోప్ (0) రనౌట్ రూపంలో వెనుదిరగడం జట్టుని దారుణంగా దెబ్బతీసిందని హోల్డర్ చెప్పుకొచ్చాడు.

377/5 భారీ స్కోరును చేసిన టీమిండియా
‘వన్డే, టీ20ల్లో రనౌట్స్ జట్టుపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతాయి. ఛేదన ఆరంభంలోనే వరుసగా ఇద్దరు టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ రనౌటవడంతో జట్టుపై ఒత్తిడి పెరిగింది. ఈ క్రమంలో మిగిలిన ఆటగాళ్లు కూడా సరిగా బ్యాటింగ్ చేయలేకపోయారు. కనీసం ఇద్దరు టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ మెరుగ్గా ఆడగలిగిందంటే..? ఛేదనలో భారత్కి పోటీనిచ్చేవాళ్లం.'

వరుస రనౌట్లు కారణంగా..
'బౌలింగ్ సమయంలోనూ మా బౌలర్లు ధారాళంగా పరుగులిచ్చేశారు. మరోవైపు ఛేదనలో వరుస రనౌట్లు కారణంగా.. ఆఖరి వరకూ కనీసం ఒక్కటి కూడా మెరుగైన భాగస్వామ్యాన్ని నమోదు చేయలేకపోయాం' అని హోల్డర్ వెల్లడించాడు.

ఆఖరి వన్డేను గురువారం భారత్
సిరీస్లో భాగంగా ఆఖరి వన్డేను గురువారం భారత్, వెస్టిండీస్ మధ్య తిరువనంతపురం వేదికగా జరగనుంది. ప్రస్తుతం జరిగిన నాలుగు మ్యాచ్లలో రెండింటిలో భారత్ గెలుపొందింది. ఒక దాన్లో ఓడిపోయింది. మరొక మ్యాచ్ను ఇరు జట్లు టైగా ముగించాయి.


Click it and Unblock the Notifications













