మ్యాచ్కే హైలైట్:
ఈ మ్యాచ్లో బ్యాట్స్మన్ సిక్సర్ల మోత మోగించి అభిమానులను అలరించారు. అయితే బ్యాట్స్మన్లు కొట్టిన సిక్సర్ల కంటే.. విండీస్ ఫీల్డర్ ఎవిన్ లెవిస్ చేసిన ఓ ఫీల్డింగ్ విన్యాసం మ్యాచ్కే హైలైట్గా నిలిచింది. అప్పటికే భారత్ ఓపెనర్ 'హిట్మ్యాన్' రోహిత్ శర్మ సిక్సర్ల మోత ప్రారంభించాడు. ఐదవ ఓవర్ వేస్తున్న పెర్రీ బౌలింగ్లో తొలి బంతికే రోహిత్ ఓ సిక్స్ బాదాడు. రెండో బంతిని కూడా లెగ్ సైడ్ బలంగా బాదాడు.
లెవిస్ ఫీల్డింగ్ విన్యాసం:
బౌండరీ లైన్ దగ్గర ఉన్న ఫీల్డర్ ఎవిన్ లెవిస్ సిక్సర్ వెళ్లే బంతిని అద్భుతంగా పట్టుకున్నాడు. అయితే తన బ్యాలెన్స్ అదుపు చేసుకోలేక బంతిని మైదానంలో విసిరి బౌండరీ అవతలికి జంప్ చేశాడు. అంతేకాదు ఆ పక్కనే ఉండే మరో బౌండరీ అవతలికి జంప్ చేసి తిరిగి వచ్చి బంతిని కీపర్ వైపు విసిరాడు. ఈలోగా రోహిత్ రెండు పరుగులు తీసాడు. లెవిస్ నాలుగు పరుగులు సేవ్ చేసాడు. సహచర ఆటగాళ్లు లెవిస్ను అభినందించారు. ఈ స్టన్నింగ్స్ ఫీట్ మ్యాచ్కే హైలైట్ నిలిచింది.
వాట్ ఏ ఫీల్డింగ్:
ప్రస్తుతం ఎవిన్ లెవిస్ ఫీల్డింగ్ విన్యాసం సోషల్ మీడియాలో వైరల్ అయింది. అభిమానులు ఈ వీడియోను తెగ షేర్ చేస్తూ లైకులు కొడుతున్నారు. అంతేకాదు లెవిస్పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 'వాహ్.. వాట్ ఏ ఫీల్డింగ్' అని ఓ అభిమాని కామెంట్ చేయగా.. 'లెవిస్ ఫీల్డింగ్ సూపర్' అని మరో అభిమాని కామెంట్ పెట్టాడు. అయితే క్యాచ్ పట్టే సమయంలో లెవిస్కు గాయం కావడంతో బ్యాటింగ్కు రాలేదు.
— Cricket (@cricketvideos13) 11 December 2019 |
పొలార్డ్ ఒంటరి పోరాటం:
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 240 పరుగుల భారీ స్కోరు చేసింది. లక్ష్య ఛేదనలో వెస్టిండీస్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 173 పరుగులు చేసి ఓటమిపాలయింది. కెప్టెన్ పొలార్డ్ (39 బంతుల్లో 68; 5 ఫోర్లు, 6 సిక్స్లు) ఒంటరి పోరాటం చేశాడు. భారత బౌలర్లలో దీపక్ చాహర్, భువనేశ్వర్, మొహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్ తలా 2 వికెట్లు తీశారు. రాహుల్కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్', కోహ్లీకి 'మ్యాన్ ఆఫ్ ద సిరీస్' అవార్డులు దక్కాయి.