విన్నింగ్ కాంబినేషన్తో బరిలోకి:
అయితే రెండో టెస్టుకు విన్నింగ్ కాంబినేషన్తో భారత్ బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ ఆశించిన స్థాయిలో రాణించకపోయినా మరో అవకాశం లభించవచ్చు. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. పుజారా పరుగులు చేయలేకపోయినా.. టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్మన్గా జట్టులో ఉంటాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫామ్ గురించి చెప్పనవసరం లేదు. ఇక రోహిత్ శర్మను కాదని తీసుకున్న అంజిక్య రహానే విజయాన్ని సాధించి పెట్టాడు. హనుమ విహారి కూడా తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. వీరందరూ రెండో టెస్టులో కొనసాగడం ఖాయం.
మరిన్ని అవకాశాలు:
వికెట్ కీపర్ పంత్ విఫలమయినా.. ధోనీ వారసుడిగా అతనికి మరిన్ని అవకాశాలు ఇచ్చే సూచలు ఉన్నాయి. సీనియర్ కీపర్ సాహాకు మళ్లీ నిరాశే ఎదురవ్వొచ్చు. ఇక సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తొలి టెస్టులో లేకపోవడం చాలా ప్రశ్నలను లేవనెత్తింది. కెప్టెన్ విరాట్ కోహ్లీపై మాజీలు విమర్శల వర్షం కురిపించారు. అశ్విన్ స్థానంలో జట్టులోకి వచ్చిన రవీంద్ర జడేజా సత్తా చాటాడు. తొలి ఇన్నింగ్స్లో కీలక సమయంలో అర్ధ సెంచరీ చేయడం.. రెండో ఇన్నింగ్స్లో రెండు వికెట్లు తీయడంతో జడేజా కొనసాగే అవకాశం ఉంది.
అనూహ్య నిర్ణయం తీసుకుంటే తప్ప:
ఇక పేస్ త్రయం జస్ప్రీత్ బుమ్రా, మొహ్మద్ షమీ, ఇషాంత్ శర్మలు అద్భుతంగా రాణిస్తున్నారు. ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా నిప్పులు చెరిగే బంతులతో విండీస్ బ్యాట్స్మన్ను బెంబేలెత్తించాడు. రెండో ఇన్నింగ్స్లో అద్భుత స్పెల్తో ( 5/7) విండీస్ ఇన్నింగ్స్ను కకాలవికాలం చేసాడు. దీంతో ఈ త్రయం కొనసాగనున్నారు. ఇక అశ్విన్కు చోటు దక్కే అవకాశమే లేదు. ఒకవేళ విమర్శల నేపథ్యంలో కాప్టెన్ కోహ్లీ ఏదైనా అనూహ్య నిర్ణయం తీసుకుంటే తప్ప అశ్విన్ జట్టులోకి రాలేడు.
జట్టు (అంచనా):
మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్, చెటేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్య రహానే, హనుమ విహారి, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, మొహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ.