|
హాఫ్ సెంచరీకి చేరువలో కోహ్లీ ఔట్
దీంతో 53 బంతుల్లో 11 ఫోర్లు, సిక్సర్ సాయంతో 70 పరుగులు చేసి వారికన్ బౌలింగ్లో హెట్మయెర్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ (45: 78 బంతుల్లో 5 ఫోర్లు) హాఫ్ సెంచరీకి చేరువలో కెప్టెన్ జాసన్ హోల్డర్ బౌలింగ్లో అతడికే నేరుగా క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. రహానెతో కలిసి నాలుగో వికెట్కి 60 పరుగుల కీలక భాగస్వామ్యంతో జట్టుని మెరుగైన స్కోరు దిశగా నడిపించాడు.
కెప్టెన్గా అత్యధిక పరుగులు చేసిన ఆసియా క్రికెటర్గా
ఈ క్రమంలో కోహ్లీ ఓ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. కెప్టెన్గా అత్యధిక పరుగులు చేసిన ఆసియా క్రికెటర్గా కోహ్లీ అరుదైన రికార్డు నెలకొల్పాడు. 65.96 యావరేజ్తో 4222 పరుగులు చేసిన కోహ్లీ, పాక్ మాజీ కెప్టెన్ మిస్బావుల్ హక్ను అధిగమించాడు. అంతకముందు ఆసియాలో అత్యధిక పరుగులు చేసిన రికార్డు పాకిస్థాన్ మాజీ కెప్టెన్ మిస్బావుల్ హక్ పేరిట ఉంది.
56 టెస్టుల్లో 51.39 యావరేజితో 4214 పరుగులు
పాక్ తరుపున కెప్టెన్గా మిస్బావుల్ హక్ 56 టెస్టుల్లో 51.39 యావరేజితో 4214 పరుగులు చేశాడు. ఇందులో 8 సెంచరీలు ఉన్నాయి. కెరీర్లో 56 మ్యాచ్లకి కెప్టెన్సీ వహించి హక్ ఆ రికార్డు నెలకొల్పగా.. కోహ్లీ కేవలం 42 మ్యాచ్ల్లోనే ఆ మార్క్ని అందుకోవడం విశేషం. కెప్టెన్ కోహ్లీ 42 మ్యాచ్ల్లో 4233 పరుగులు చేశాడు. అంతేకాదు పాక్ మాజీ కెప్టెన్ మిస్బావుల్ హక్ యావరేజితో పోలిస్తే కోహ్లీ యావరేజ్ ఎక్కువగా ఉండటం విశేషం.
|
ఏ బ్యాట్స్మన్తో పోల్చినా కోహ్లీదే ఎక్కువ
కోహ్లీ ఈ పరుగులను 65.12 యావరేజితో నమోదు చేశాడు. ఇందులో 17 సెంచరీలు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఏ బ్యాట్స్మన్తో పోల్చినా కోహ్లీదే ఎక్కువగా ఉండటం విశేషం. కెప్టెన్గా టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ 8659 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. సఫారీ జట్టు తరుపున మొత్తం 109 మ్యాచ్లాడిన గ్రేమ్ స్మిత్ 47.84 యావరేజితో ఈ పరుగులు సాధించాడు.
|
8వ స్థానంలో విరాట్ కోహ్లీ
ఇందులో 25 సెంచరీలు ఉన్నాయి. ఆ తర్వాత వరుసగా అలెన్ బోర్డర్ (ఆస్ట్రేలియా) 6,623 పరుగులు, రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా) 6,542.. క్లైవ్ లాయిడ్ (వెస్టిండీస్ ) 5,233.. స్టీఫెన్ ఫ్లెమింగ్ (న్యూజిలాండ్) 4,844 రన్స్తో టాప్-5లో ఉండగా.. కోహ్లీ 8వ స్థానంలో కొనసాగుతున్నాడు. అంతకముందు తొలి ఇన్నింగ్స్లో వెస్టిండిస్ జట్టు 101.4 ఓవర్లలో 311 పరుగులకే ఆలౌటైంది.
|
311 పరుగులకే వెస్టిండిస్ ఆలౌట్
ఓవర్ నైట్ స్కోరు 295/7తో శనివారం ఇన్నింగ్స్ను ప్రారంభించిన వెస్టిండిస్ జట్టు ఎంతో సేపు క్రీజులో నిలవలేకపోయింది. కేవలం 16 పరుగులను మాత్రమే జోడించి మిగిలిన మూడు వికెట్లను కోల్పోయింది. తొలిరోజు భారత బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్న విండీస్ ఓవర్నైట్ ఆటగాడు రోస్టన్ ఛేజ్(106; 189 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత రోస్టన్ చేజ్ (106) ఉమేశ్ యాదవ్ బౌలింగ్లో పెవిలియన్కు చేరాడు.
6 వికెట్లు తీసిన ఉమేశ్ యాదవ్
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన బిషూ(2), గాబ్రియెల్లు వెనువెంటనే పెవిలియన్ బాటపట్టారు. ఈ టెస్టులో రోస్టన్ ఛేజ్ వికెట్ తీయడం ద్వారా ఉమేశ్ యాదవ్ టెస్టుల్లో రెండోసారి ఐదు వికెట్లను తీసుకున్నాడు. చివరి మూడు వికెట్లు ఉమేశ్ యాదవ్ సాధించడం మరో విశేషం. దీంతో రెండో రోజు మ్యాచ్ ప్రారంభమైన కొద్ది సేపటికే వెస్టిండిస్ జట్టు ఆలౌటైంది. కెప్టెన్ జాసన్ హోల్డర్ 52 పరుగులు చేశాడు. మిగతా బ్యాట్స్మెన్ ఎవరూ పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. భారత బౌలర్లలో ఉమేశ్ యాదవ్ 88 పరుగులిచ్చి 6 వికెట్లు తీయగా.. కుల్దీప్ యాదవ్ మూడు, అశ్విన్ ఒక వికెట్ తీసుకున్నారు.