99 బంతుల్లో సెంచరీ సాధించిన పృథ్వీషా
కెరీర్లో తొలి టెస్టు మ్యాచ్ ఆడుతున్నా.. ఆ ఒత్తిడేమీ అతడిలో కనిపించలేదు. క్రీజులోకి వచ్చినప్పటి నుంచీ బౌలర్లపై ఎదురుదాడికి దిగిన పృథ్వీషా... కేవలం 99 బంతుల్లోనే సెంచరీ చేయడం విశేషం. పుజారాతో కలిసి పృథ్వీషా అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ ఇద్దరూ కలిసి రెండో వికెట్కు 206 పరుగులు జోడించారు.
209 పరుగుల వద్ద పుజారా ఔట్
ప్రమాదకరంగా మారిన ఈ జోడీని జట్టు స్కోరు 209 పరుగుల వద్ద లావిస్ విడదీశాడు. బంతిని హిట్ చేసే క్రమంలో పుజారా డోవ్రిచ్కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. అనంతరం కొద్దిసేపటికే పృథ్వీ షా కూడా దేవేంద్ర బిషూ బౌలింగ్లో అతనికే క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఈ సమయంలో భారత స్కోరు 232/3.
రహానేతో కలిసి కోహ్లీ మరో సెంచరీ భాగస్వామ్యం
ఈ దశలో క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ.. వైస్ కెప్టెన్ రహానే (41)తో కలిసి మరో సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ టెస్టుల్లో 20వ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. హాఫ్ సెంచరీకి 9 పరుగుల దూరంలో పెవిలియన్ చేరాడు. రోస్టన్ చేజ్ వేసిన 83.3వ బంతిని ఆడబోయిన రహానే కీపర్ డోవ్రిచ్కు క్యాచ్ ఇచ్చాడు.
తొలిరోజు ఆట ముగిసే సమయానికి భారత్ 364/4
భారత్ స్కోరుని 300 దాటించిన ఈ జోడీ జట్టు స్కోరు 337 పరుగుల వద్ద రహానే ఔటవడంతో విడిపోయింది. రహానే ఔటైనా.. క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్తో కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడిన కోహ్లీ తొలిరోజు 364/4తో తొలిరోజు ఆటని ముగించాడు. విండీస్ బౌలర్లలో షనాన్ గాబ్రియల్, షెర్మన్ లూయిస్, దేవేంద్ర బిషూ, రోస్టన్ చేజ్ చెరో వికెట్ పడగొట్టారు.