హైదరాబాద్: లీడ్స్ వేదికగా భారత్తో జరుగుతున్న మ్యాచ్లో శ్రీలంక బ్యాట్స్మన్ కుశాల్ పెరీరాకు లైఫ్ లభించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకుంది. భువనేశ్వర్ కుమార్ వేసిన ఇన్నింగ్స్ ఐదో ఓవర్ తొలి బంతిని కుశాల్ పెరీరా ఫ్రంట్ పుట్ వేసి మరీ మిడాఫ్ మీదుగా భారీ షాడ్ ఆడాడు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ఆ సమయంలో అక్కడే ఫీల్డింగ్ చేస్తోన్న కుల్దీప్ యాదవ్ పరుగెత్తుకుంటూ వచ్చి ఆ బంతిని క్యాచ్ అందుకునే ప్రయత్నం చేశాడు. అదే సమయంలో హార్దిక్ పాండ్యా కూడా బంతిని అందుకునేందుకు పరిగెత్తుకుంటూ రాగా సమన్వయలోపం కారణంగా కుల్దీప్ క్యాచ్ మిస్ చేశాడు. దీంతో శ్రీలంకకు రెండు పరుగులు లభించాయి.
So close 😅
— Cricket World Cup (@cricketworldcup) July 6, 2019
Almost a catch, and almost a collision 💥
Can Kusal make the most of the reprieve?#CWC19 | #SLvIND pic.twitter.com/1M7f0sleLo
ప్రస్తుతం 5 ఓవర్లుక గాను శ్రీలంక వికెట్ నష్టానికి 28 పరుగులు చేసింది. క్రీజులో కుశాల్ పెరీరా(17), ఆవిష్కా ఫెర్నాండో పరుగులేమీ చేయకుండా క్రీజులో ఉన్నారు. ఈ మ్యాచ్లో శ్రీలంక ఒక మార్పుతో బరిలోకి దిగింది. టీమిండియా ఇప్పటికే సెమీస్కు చేరడంతో కోహ్లీసేనకు ఇది నామమాత్రపు మ్యాచే.
అయితే, ఈ మ్యాచ్లో గెలిస్తే పాయింట్లు పెరిగే అవకాశం ఉంది. టీమిండియా ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్ల్లో ఆరింట విజయం సాధించి 13 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు భారత్, శ్రీలంక జట్లు ఇప్పటివరకు 158 మ్యాచ్లు ఆడాయి. 90 మ్యాచ్ల్లో భారత్.. 56 మ్యాచ్ల్లో శ్రీలంక గెలిచాయి.
ఒక మ్యాచ్ 'టై' అయింది. ఇక 11 మ్యాచ్లు రద్దయ్యాయి. మరోవైపు ప్రపంచకప్లో ఈ రెండు జట్ల మధ్య 8 మ్యాచ్లు జరిగాయి. 3 మ్యాచ్ల్లో భారత్.. 4 మ్యాచ్ల్లో శ్రీలంక నెగ్గాయి. మరో మ్యాచ్ రద్దయింది.