311వ వన్డే ఆడబోతున్న ధోని
అంతేకాదు ధర్మశాల వేదికగా జరిగిన తొలి వన్డే ధోనికి 310వ వన్డే. ఇక, మొహాలీలో బుధవారం ఆడనున్న వన్డే 311వది కావడం విశేషం. టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ భారత్ తరుపున తన కెరీర్లో 311 వన్డేలు ఆడాడు. ఇప్పుడు ఆ రికార్డుని ధోని సమం చేయనున్నాడు. ఆ తర్వాత విశాఖపట్నం వేదికగా జరిగే మూడో వన్డేలో ఆ రికార్డుని ధోని అధిగమిస్తాడు.
నాలుగో స్ధానంలో నిలవనున్న ధోని
తద్వారా భారత్ తరుపున అధ్యధిక వన్డేలాడిన వారి జాబితాలో ధోని నాలుగో స్ధానంలో నిలుస్తాడు. ధోని కంటే ముందు సచిన్ టెండూల్కర్ (463), రాహుల్ ద్రవిడ్ (344), మహ్మద్ అజహరుద్దీన్ (334)లు ఉన్నారు. దీంతో పాటు వన్డేల్లో 36 ఏళ్ల ధోని మరో 109 పరుగులు చేస్తే పదివేల క్లబ్లో చేరతాడు. ఇప్పటివరకు వన్డేల్లో ధోని 310 వన్డేల్లో 51.8 యావరేజితో 9,891 పరుగులు చేశాడు.
వయసు పెరుగుతున్నప్పటికీ
ఇప్పటివరకు 10 సెంచరీలు, 67 హాఫ్ సెంచరీలు చేసిన ధోని
ఇందులో 10 సెంచరీలు, 67 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇదిలా ఉంటే వయసు పెరుగుతున్నప్పటికీ తనలో క్రికెట్ ఆడే సత్తా తగ్గలేదని ధోని నిరూపిస్తూనే ఉన్నాడు. ధర్మశాల వేదికగా జరిగిన తొలి వన్డేలో 29 పరుగులకే 7 వికెట్లు నష్టపోయి కష్టాల్లో ఉన్న భారత్ను ఆదుకున్న సంగతి తెలిసిందే. భారత జట్టు 50 పరుగులకే ఆలౌట్ కాకుండా హాఫ్ సెంచరీతో రాణించి 112 పరుగులకు చేర్చాడు.
మొహాలీ వేదికగా బుధవారం రెండో వన్డే
తొలి వన్డేలో 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 87 బంతుల్లో 65 పరుగులు నమోదు చేశాడు. కాగా, మూడు వన్డేల సిరిస్లో భాగంగా భారత్-శ్రీలంక జట్ల మధ్య రెండో వన్డే మొహాలీ వేదికగా బుధవారం జరగనుంది. తొలి వన్డేలో శ్రీలంక విజయం సాధించడంతో మూడు వన్డేల సిరిస్లో 1-0 ఆధిక్యంలో ఉంది. ఇరు జట్ల మధ్య జరగనున్న చివరి వన్డేకి విశాఖపట్నం ఆతిథ్యమివ్వనుంది.