శాస్త్రి వ్యాఖ్యలను తిప్పికొట్టిన గవాస్కర్
ఈ నేపథ్యంలో రవిశాస్ర్తి మాట్లాడుతూ గత 15-20 ఏళ్లలోని భారత జట్ల కంటే కూడా ప్రస్తుత జట్టు విదేశాల్లో మెరుగైన రికార్డు కలిగి ఉందని ఐదో టెస్టు ఆరంభానికి ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో చెప్పిన సంగతి తెలిసిందే. శాస్త్రి వ్యాఖ్యలను గవాస్కర్ తిప్పికొట్టాడు.
మాకంటే మెరుగ్గా ఎవరూ ఆడలేదు
"విదేశాల్లో మాకంటే మెరుగ్గా ఎవరూ ఆడలేదని చెప్పగలను. 1980వ దశకంలోనే భారత జట్టు ఇంగ్లండ్, వెస్టిండీస్ల్లో గెలిచాయి. అంతేకాదు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలో టెస్టు మ్యాచ్ గెలిచాం" అని గవాస్కర్ పేర్కొన్నాడు. ఇంగ్లండ్లో చివరిసారి 2007లో ద్రవిడ్ నేతృత్వంలోని జట్టు సిరీస్ గెలిచింది. అయితే అప్పట్లో ద్రవిడ్కు రావాల్సిన పేరు రాలేదని గవాస్కర్ అన్నాడు.
ద్రవిడ్ కెప్టెన్సీలో 2005లో విండీస్లో, 2007లో
"ద్రవిడ్ కెప్టెన్సీలో 2005లో విండీస్లో, 2007లో ఇంగ్లండ్లో భారత్ సిరీస్లు నెగ్గింది. అంతేకాదు అతడి సారథ్యంలోనే తొలిసారి దక్షిణాఫ్రికాను వారి దేశంలో భారత్ ఓడించింది. కానీ ఆ విజయాల్లో ద్రావిడ్కు అంతగా పేరు రాలేదు. ఏదేమైనా విదేశాల్లో సిరీస్లు కైవసం చేసుకున్న భారత జట్లూ ఉన్నాయి" అని గవాస్కర్ తెలిపాడు.
సరైన ఫుట్వర్క్ లేదు
"కానీ ఇప్పటి పరిస్థితి చాలా తేడాగా ఉంది. స్పిన్నర్ మొయిన్ అలీని ఎదుర్కొనే సత్తా మన బ్యాట్స్మన్కు లేకపోయింది. సరైన ఫుట్వర్క్ లేదు. బంతి ఎక్కడ పడుతుందో కూడా అర్థం చేసుకోలేకపోయారు. స్లిప్ క్యాచ్లు కూడా పట్టలేకపోయారు" అని గవాస్కర్ విమర్శించాడు. మరోవైపు ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో నంబర్వన్గా ఉన్న భారత జట్టు కనీసం ఆఖరి మ్యాచ్లోనైనా గెలిచి చూపించాలని మాజీ ఆటగాడు మొహిందర్ అమర్నాథ్ సవాల్ విసిరాడు.