టీ20ల్లో అత్యధిక సార్లు బౌల్డ్
ఫలితంగా భారత తరుపున టీ20ల్లో అత్యధిక సార్లు బౌల్డ్ అయిన బ్యాట్స్మన్గా రోహిత్ శర్మ ఓ చెత్త రికార్డుని సొంతం చేసుకున్నాడు. ఇప్పటివరకు మొత్తం 101 అంతర్జాతీయ టీ20లాడిన రోహిత్ శర్మ 14 సార్లు బౌల్డయ్యాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ అగ్రస్థానంలో ఉండగా ఆ తర్వాతి స్థానాల్లో ధోని(13), ధావన్(11), రైనా(11), కోహ్లీ(6) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
30 పరుగుల తేడాతో టీమిండియా విజయం
కాగా, మూడో టీ20లో టీమిండియా 30 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. భారత పేసర్ దీపక్ చాహర్ 6 వికెట్లతో చెలరేగడంతో 175 పరుగుల లక్ష్య ఛేదనలో బంగ్లా 19.2 ఓవర్లలో 144 పరుగులకు ఆలౌట్ అయింది. చాహర్ హ్యాట్రిక్ కూడా నమోదు చేసాడు. మొహమ్మద్ నైమ్ ఒంటరి పోరాటం చేసినా జట్టును గెలిపంచలేకపోయాడు.
సౌమ్య సర్కార్ గోల్డెన్ డకౌట్
175 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్కు దీపక్ భారీ షాక్ ఇచ్చాడు. వరుస బంతుల్లో ఓపెనర్ లిటన్ దాస్ (9), సౌమ్య సర్కార్ (0)లను వెనక్కి పంపాడు. చాహర్ వేసిన మూడో ఓవర్ నాలుగో బంతిని లిటన్ భారీ షాట్ ఆడే ప్రయత్నంలో వాషింగ్టన్ సుందర్కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఆ తర్వాతి బంతికే సౌమ్య సర్కార్ గోల్డెన్ డకౌటయ్యాడు.
12 పరుగులకే రెండు వికెట్లు
12 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన దశలో మొహమ్మద్ నైమ్ (81), మొహమ్మద్ మిథున్ (27) లు జోరు పెంచారు. భారత బౌలర్లకు చిక్కకుండా స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఈ క్రమంలో నైమ్ 7 ఫోర్లు, సిక్సర్ సాయంతో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే ఒకే స్కోర్ వద్ద మిథున్, రహీమ్ (0) ఔట్ అవ్వడంతో బంగ్లాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది.
దీపక్ చాహర్ హ్యాట్రిక్
ఆపై నైమ్ కూడా పెవిలియన్ చేరడంతో బంగ్లా వికెట్ల పతనం ఆగలేదు. చహల్, దూబేలకు తోడు ఇన్నింగ్స్ చివరలో చాహర్ హ్యాట్రిక్ నమోదు చేయడంతో బంగ్లా ఆలౌటైంది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.