బ్రాడ్మన్ రికార్డుని సమం చేస్తాడా?
శుక్రవారం నుంచి బంగ్లాతో ప్రారంభమయ్యే పింక్ బాల్ టెస్టులో మయాంక్ అగర్వాల్ గనుక ఈ పరుగులు సాధిస్తే ఆస్ట్రేలియా లెజెండరీ బ్యాట్స్మన్ సర్ బ్రాడ్మన్ రికార్డుని సమం చేస్తాడు. సర్ బ్రాడ్మన్ కూడా టెస్టుల్లో 13 ఇన్నింగ్స్ల్లో వెయ్యి పరుగులు సాధించగా, ఇప్పుడు మయాంక్ను కూడా అదే రికార్డు ఊరిస్తోంది.
టెస్టుల్లో అత్యంత వేగవంతంగా
టెస్టుల్లో అత్యంత వేగవంతంగా(ఇన్నింగ్స్లు పరంగా) వెయ్యి పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో సట్క్లిఫీ(ఇంగ్లండ్), ఈడీ వీకెస్(వెస్టిండీస్) సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నారు. వీరిద్దరూ కూడా 12వ ఇన్నింగ్స్ల్లోనే టెస్టుల్లో వెయ్యి పరుగులు మైలురాయిని అందుకున్నారు. ఆ తర్వాత స్థానంలో బ్రాడ్మన్ ఉన్నాడు.
11వ స్థానంలో మయాంక్
వినోద్ కాంబ్లీ(భారత్), హర్వే(ఆస్ట్రేలియా)లు 14 ఇన్నింగ్స్ల్లో వెయ్యి పరుగులు సాధించి ఈ జాబితాలో మూడో స్థానంలో కొనసాగుతున్నారు. ప్రతిష్టాత్మక పింక్ బాల్ టెస్టులో సర్ బ్రాడ్మన్ రికార్డుని అందుకునేందుకు మయాంక్ అగర్వాల్కు సువర్ణావకాశం. బంగ్లాతో తొలి టెస్టులో డబుల్ సెంచరీ సాధించిన మయాంక్ టెస్టు ర్యాంకింగ్స్లో 11వ స్థానంలో నిలిచాడు.
మయాంక్పై గవాస్కర్ ప్రశంసల వర్షం
కాగా, అంతకముందు దక్షిణాఫ్రికాతో ముగిసిన మూడు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా విశాక వేదికగా జరిగిన టెస్టులో మయాంక్ అగర్వాల్ డబుల్ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. మయాంక్ అగర్వాల్ ఫామ్పై ఇటీవలే సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ " 'ప్రస్తుతం మయాంక్ టెస్టు క్రికెట్ను ఆస్వాదిస్తున్నాడు. ఇది అతనికి మొదటి సంవత్సరమే. రెండో ఏడాది కూడా అతను ఇలానే పరుగులు చేయాలని ఆశిస్తున్నా. అయితే మయాంక్కు అసలైన నిజమైన పరీక్ష భవిష్యత్తులో ఎదురవడం ఖాయం' అని అన్నారు.