మ్యాచ్ జరుగుతున్నంత సేపు
మ్యాచ్ జరుగుతున్నంత సేపు తనకు 2001లో ఆస్ట్రేలియాతో జరిగిన చారిత్రక టెస్టు మ్యాచ్ గుర్తొచ్చిందని దాదా తెలిపాడు. "ఓహ్! ఇది ఖచ్చితంగా అద్భుతమైన అనుభూతి. చాలా బాగుంది. మీ కోసం చూడండి. ఈ మ్యాచ్ నాటి జ్ఞాపకాలను ఈ మ్యాచ్ తిరిగి గుర్తు చేసింది. టెస్టు క్రికెట్ అంటే ఇలానే ఉండాలి" అని గంగూలీ సంతోషం వ్యక్తం చేశాడు.
నేను చాలా సంతోషంగా ఉన్నా
భారత్లో తొలిసారి నిర్వహించిన డే నైట్ టెస్టు మ్యాచ్ విజయవంతం కావడంపై గంగూలీ "మీ సహచరులు మిమ్మల్ని అభినందించినప్పుడు చాలా బాగుంది. నేను చాలా సంతోషంగా ఉన్నా. అవును, ఇది చాలా సంతృప్తికరమైన అనుభూతి" అని సౌరవ్ గంగూలీ వెల్లడించాడు.
తమతో డే నైట్ టెస్టు ఆడాలంటూ
ఈ ఏడాది మొదట్లో తమతో డే నైట్ టెస్టు ఆడాలంటూ క్రికెట్ ఆస్ట్రేలియా బీసీసీఐని అడిగినప్పటికీ అందుకు అంగీకరించలేదు. అయితే, గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వారం రోజుల్లోనే డే నైట్ టెస్టు గురించి కోహ్లీని ఒప్పించడంతో పాటు డే నైట్ టెస్టు విజయవంతం కావడంలో కీలకపాత్ర పోషించాడు.
గులాబీమయమైన కోల్కతా
భారత్లో జరిగిన తొలి డే నైట్ టెస్టుకు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ పింక్ బాల్ టెస్టు కోసం కోల్కతా నగరం మొత్తం గులాబీమయం అయింది. నగరంలోని ప్రధాన భవనాలు, షాపులు, హౌరాబ్రిడ్జి వంటి వాటిని గులాబి రంగుల విద్యుద్దీపాలతో అలంకరించారు.