2-1తో ఆధిక్యంలో టీమిండియా
ఇప్పటికే నాలుగు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో 2-1తో ఆధిక్యంలో ఉంది. అడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్టుతో పాటు మెల్ బోర్న్ వేదికగా జరిగిన మూడో టెస్టులో టీమిండియా విజయం సాధించగా... పెర్త్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఆతిథ్య జట్టు విజయం సాధించింది. దీంతో సిడ్నీ వేదికగా జరిగే నాలుగో టెస్టులో టీమిండియా నెగ్గినా లేదా డ్రాగా ముగించినా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని నిలుపుకోనే అవకాశం ఉంది.
మీడియా సమావేశంలో
సిడ్ని టెస్ట్కు ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో విరాట్ కోహ్లీ మాట్లాడుతూ "టీమిండియా రికార్డ్లు బద్దలు కొట్టడానికో, చరిత్ర సృష్టించడానికో ఆడటం లేదు. అంచనాలకు తగ్గట్టుగా రాణించి ఒక్కో సిరీస్ నెగ్గడమే తమ ముందున్న లక్ష్యం. రికార్డుల గురించి ఆలోచిస్తే తమ జట్టు ఇంతలా సక్సెస్ అయ్యి ఉండేది కాదు" అని అన్నాడు.
ఆసీస్ గడ్డపై టెస్ట్ సిరీస్ నెగ్గడం పెద్ద సవాల్ అని, ప్రస్తుత సిరీస్తో
టీమిండియా కల నెరవేరబోతోందని కోహ్లీ అన్నాడు. "2014లో ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నప్పుడే ధోనీ రిటైరయ్యాడు. అందరూ యువకులతో కూడిన భారత జట్టు అప్పుడు టెస్ట్ల్లో 7వ స్థానంలో ఉండేది. నెంబర్ వన్ జట్టుగా ఎదగడానికి ఎంతగానో కష్టపడ్డాం" అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.
కెరీర్లో అత్యుత్తమం
"ఆసీస్ గడ్డపై టెస్ట్ సిరీస్ నెగ్గితే తన కెరీర్లో అత్యుత్తమంగా నిలిచిపోతుంది. ఆ తర్వాత ఆడే ప్రతీ సిరీస్లోనూ తమ స్థాయికి తగ్గట్టుగా రాణించి ఇదే జైత్రయాత్ర కొనసాగిస్తాం" అని కోహ్లీ అన్నాడు.
జట్ల వివరాలు:
భారత్: కోహ్లీ(కెప్టెన్), రహానె(వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, పుజారా, హనుమ విహారి, రిషబ్పంత్, జడేజా, కుల్దీప్ యాదవ్, అశ్విన్, షమీ, బుమ్రా, ఉమేశ్ యాదవ్.