|
86 పరుగులకే ఆరోన్ ఫించ్కి చిక్కి..
మూడో టెస్టులో నాలుగో స్థానంలో బ్యాటింగ్కు దిగిన కోహ్లీ.. 86 పరుగులు సాధించాడు. భారత్-ఆస్ట్రేలియా మూడో టెస్టు రెండో రోజు ఆటలో ఓవర్ నైట్ స్కోరు 215/2తో బ్యాటింగ్కు దిగిన భారత్ను కెప్టెన్ కోహ్లి, పుజారాలు భారీ స్కోరు దిశగా నడిపించారు. స్టార్క్ వేసిన షార్ట్లెంగ్త్ ఆఫ్సైడ్ బంతిని బౌండరీకి తరలిద్దామనుకున్న కోహ్లి థర్డ్మాన్లో ఉన్న ఆరోన్ ఫించ్ చేతికి చిక్కాడు.
వ్యక్తిగతంగా మరో మైలురాయిని
ద్రవిడ్ కంటే ముందు 1983లో మొహీందర్ అమర్నాథ్ 1065 పరుగులు చేయగా.. 1971లో సునీల్ గావస్కర్ 918 పరుగులు చేశారు. ఇక టెస్టులో కోహ్లీ వ్యక్తిగతంగా మరో మైలురాయిని అధిగమించాడు. టెస్టుల్లో అత్యధిక పరుగులు కంగారూ జట్టు మీదనే చేశాడు. ఆసీస్ జట్టుమీద 1573 పరుగులు చేయగా, ఇంగ్లండ్పై 1570, శ్రీలంకపై 1005 పరుగులు చేశాడు. మెల్బోర్న్ వేదికగా ఆసీస్తో జరుగుతున్న మూడో టెస్టులో కోహ్లీకి సెంచరీ చేజారింది. తొలి రోజు నుంచి క్రీజులో కుదురుకుని ఆసీస్ బౌలర్లను ఆటాడుకున్న కోహ్లీ.. 82 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు.
బాక్సింగ్ డే టెస్టులో 4వికెట్లు కోల్పోయిన టీమిండియా
ఎదురుచూస్తోన్న సచిన్, గంగూలీ రికార్డులు
ఈ ఇన్నింగ్స్లో సెంచరీ చేసి ఉంటే కోహ్లీని వరించాలని ఎన్నో రికార్డులు ఎదురుచూస్తున్నాయి. ఈ క్రమంలో ఒక వేళ ఈ టెస్టులో పూర్తి చేస్తే మాత్రం సచిన్ పేరిట ఉన్న రికార్డును, మరి కొంత మంది విదేశీ క్రికెటర్లను కొల్లగొట్టనున్నాడు. జట్టులో కీలక మార్పులతో దిగిన కోహ్లీ టెస్టు విజయం సాధిస్తే.. విదేశీ గడ్డపై ఆసియా వెలుపల అధిక విజయాలు సాధించిన కెప్టెన్గా గంగూలీతో సమమయ్యేలా కనిపిస్తున్నాడు.