పచ్చికను చూసి భయపడ్డా
ఈ నేపథ్యంలో షెఫీల్డ్ షీల్డ్లో విక్టోరియా, న్యూసౌత్వేల్స్ మధ్య జరిగిన మ్యాచ్ను ఉదాహరణగా చూపిస్తూ బ్యాట్స్మెన్ రాణించగలరంటూ అభిప్రాయపడ్డాడు. అప్పుడు పచ్చికను చూసి తాను మ్యాచ్ రెండు రోజుల్లోపే ముగుస్తుందని భావించానన్నాడు. కాగా 250 పరుగులతో అజేయంగా నిలిచానని వెల్లడించాడు.
సహనంతో నిలిస్తే ఎక్కువ పరుగులు
‘లీగ్లో భాగంగా జరిగిన మ్యాచ్కు ముందు పిచ్ను చూసి భయపడ్డాను. రెండు రోజుల్లోపే ఆట ముగిసిపోతుందేమోనని భావించా. ఎటువంటి ఆశలు లేకుండానే బరిలోకి దిగాను. తర్వాత మెల్బోర్న్ పిచ్ బాగుంటుందని తెలిసింది. కాస్త మందకొడిగా అనిపించింది. ఆదివారం పిచ్ను చూడగానే దక్షిణాఫ్రికా మ్యాచ్కు ఉన్నట్టే ఎక్కువ పచ్చికతో కనిపించింది. అయితే సహనంతో నిలిస్తే ఎక్కువ పరుగులు చేయొచ్చు. అలాగే చక్కగా బౌలింగ్ చేస్తే వికెట్లు తీయొచ్చు.
క్యూరేటర్ మ్యాట్ పేజ్ ఇదే అభిప్రాయం
కానీ, మెల్బోర్న్లో వెంటనే పరుగులు రావు. సహనంతో ఆడాల్సి ఉంటుంది. పిచ్పై పగుళ్లు ఎక్కువగా వస్తాయని అనుకోవడం లేదు' అని హ్యారిస్ అన్నాడు. ఎంసీజీ క్యూరేటర్ మ్యాట్ పేజ్ సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. బ్యాట్స్మన్తో పాటు బౌలర్లకు ప్రతి ఒక్కరికీ పిచ్ ఎంతో కొంత అనుకూలిస్తుందంటూ పేర్కొన్నాడు.