పిచ్ను తప్పుగా అంచనా వేసి.. స్పిన్నర్కు
తుది జట్టు ఎంపికలో చేసిన పెద్ద పొరబాటు పెర్త్ టెస్టులో ఓటమికి దారి తీసింది. పిచ్ను తప్పుగా అంచనా వేసి.. స్పెషలిస్టు స్పిన్నర్కు అవకాశం ఇవ్వలేదు. నలుగురూ పేసర్లనే ఎంచుకున్నారు. ఈ తప్పును ఒప్పుకోని రవిశాస్త్రి భారత్లో రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడుతున్నప్పటి నుంచే సీనియర్ స్పిన్నర్ రవీంద్ర జడేజా భుజం నొప్పితో బాధపడుతున్నాడని వెల్లడించారు. ఆస్ట్రేలియాకు వచ్చిన 4 రోజుల తర్వాత సూది మందు తీసుకుని ఉపశమనం పొందాడని పేర్కొన్నారు.
కోహ్లీయే భారత జట్టుకు బలం: బ్రాడ్ హగ్
13 మందితో జట్టును ప్రకటించినప్పుడే సమస్య
సరిగ్గా పెర్త్లో రెండో టెస్టుకు 13 మందితో జట్టును ప్రకటించినప్పుడే అతడి సమస్య బయటకు రావడం ఆశ్చర్యానికి గురి చేసింది. తుది జట్టులో లేకున్నా రెండు ఇన్నింగ్స్ల్లోనూ జడ్డూ చాలాసేపు ఫీల్డింగ్ చేశాడు. దీంతో ఒకవేళ అంత గాయపడ్డ ఆటగాడికి విశ్రాంతినివ్వకుండా జట్టు మేనేజ్మెంట్ ఎలా ఆడనిచ్చిందో మరి.
ఆస్ట్రేలియాకు వచ్చిన 4 రోజులకు సూది మందు
‘భుజంలో నొప్పి ఉందని ఆస్ట్రేలియాకు వచ్చిన నాలుగు రోజులకు జడేజా సూది మందు తీసుకున్నాడు. ఉపశమనం పొందడానికి కాస్త సమయం పడుతుంది. భారత్లో రంజీ ఆడుతున్నప్పుడే అతడికి సమస్య ఉంది. ఆసీస్కు వచ్చిన తర్వాత అలాగే ఇబ్బంది పడటంతో సూది మందు ఇచ్చారు' అని శాస్త్రి చెప్పారు. అలా అనుకుంటే వందశాతం ఫిట్నెస్ ఉండాలని లేదంటే విదేశీ పర్యటనలకు అనుమతించరంటూ పెట్టిన నిబంధనలు ఏమైనట్టోనని సందేహాలు తలెత్తాయి.
హార్దిక్ పాండ్య ఫిట్గా..
‘పెర్త్ మ్యాచ్ సమయానికి 70-80 శాతం ఫిట్గా ఉన్నట్టు అనిపించింది. ఇప్పుడు 80 శాతానికి పైగా ఫిట్గా ఉంటేనే మెల్బోర్న్లో ఆడతాడు. ఫిట్నెస్ చాలా పెద్ద సమస్య. 48 గంటల తర్వాత అశ్విన్ పరిస్థితిని అంచనావేస్తాం. రోహిత్ శర్మలో మెరుగుదల కనిపించింది. సోమవారం అతడి సంగతి తెలుస్తుంది. ఇప్పటికైతే హార్దిక్ పాండ్య ఫిట్గా ఉన్నాడు. గాయం నుంచి కోలుకున్న తర్వాత ఫస్ట్క్లాస్ క్రికెట్ ఎక్కువగా ఆడలేదు. అతడ్ని ఆడించాలా వద్దా అని నిర్ణయించే ముందు ఇంకా ఆలోచించాల్సి ఉంది' అని శాస్త్రి అన్నాడు.