హైదరాబాద్: చాలా రోజుల తర్వాత టీమిండియా ఓ చెత్త ఓటమిని నమోదు చేసింది. అటు బ్యాటింగ్తో పాటు ఇటు బౌలింగ్లోనూ పేలవ ప్రదర్శన కనబర్చింది. ఫలితంగా వాంఖడే స్టేడియం వేదికగా భారత్తో జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా అద్భుత విజయాన్ని నమోదు చేసింది. టీమిండియా నిర్దేశించిన 256 పరుగుల విజయ లక్ష్యాన్ని 37.4 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా చేధించింది.
ఆస్ట్రేలియా ఓపెనర్లు ఆరోన్ ఫించ్(110 బంతుల్లో 114, 13 ఫోర్లు, 2 సిక్సులు), డేవిడ్ వార్నర్(112 బంతుల్లో 128, 17 ఫోర్లు, 3 సిక్సులు)లు సెంచరీలు సాధించి ఆసీస్కు ఘన విజయాన్ని అందించారు. ఈ మ్యాచ్లో విజయం సాధించడంతో మూడు వన్డేల సిరిస్లో ఆస్ట్రేలియా 1-0 ఆధిక్యంలో నిలిచింది.
That's it! Australia have recorded their biggest win over India EVER! Incredible performance
— cricket.com.au (@cricketcomau) January 14, 2020
SCORES: https://t.co/J8WD0geFkm #INDvAUS pic.twitter.com/Poqrimp4DW
ఆస్ట్రేలియా విజయ లక్ష్యం 256
అంతకముందు టీమిండియా 49.1 ఓవర్లలో 255 పరుగులు చేసి ఆలౌటైంది. ఫలితంగా ఆస్ట్రేలియాకు 256 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు తీయగా... ప్యాట్ కమిన్స్, కేన్ రిచర్డ్సన్లు చెరో రెండు వికెట్లు.. ఆడమ్ జంపా, ఆష్టన్ ఆగర్లు తలో వికెట్ తీసుకున్నారు.
అచ్చిరాని నాలుగు.. క్రీజు వీడిన కోహ్లీ!!
That's that from the Wankhede.
— BCCI (@BCCI) January 14, 2020
Absolute domination by the Australian openers as Australia win the 1st ODI by 10 wickets and go 1-0 up in the three-match series.
Scorecard - https://t.co/yur0YuDrGa #INDvAUS pic.twitter.com/VF05mP0kg7
కేఎల్ రాహుల్ కొంచెం నెమ్మదిగా ఆడినప్పటికీ... శిఖర్ ధావన్ మాత్రం చెత్త బంతులను బౌండరీకి తరలిస్తూ స్కోరు బోర్డుని నడిపించాడు. ఈ క్రమంలో 66 బంతుల్లో 9 ఫోర్లు సాయంతో శిఖర్ ధావన్ హాఫ్ సెంచరీ సాధించాడు. వన్డేల్లో ధావన్కు ఇది 28వ హాఫ్ సెంచరీ.
Innings Break!
— BCCI (@BCCI) January 14, 2020
After being put to bat first, #TeamIndia are all out for 255 in 49.1 overs.
Will it be enough on this Wankhede wicket? #INDvAUS pic.twitter.com/Wg9SZfDaXN
వీరిద్దరి జోడీ 121 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించిన తర్వాత రాహుల్ ఔటయ్యాడు. జట్టు స్కోరు 134 పరుగుల వద్ద కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ ముంగిట ఆస్టన్ అగర్ బౌలింగ్లో స్టీవ్ స్మిత్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత ఆరు పరుగుల వ్యవధిలోనే శిఖర్ ధావన్(91 బంతుల్లో 74, 9 ఫోర్లు, సిక్స్) సైతం ఔటయ్యాడు. దీంతో ఆరు పరుగుల వ్యవధిలో భారత్ రెండు కీలక వికెట్లను కోల్పోయింది.
ఆ తర్వాత ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్ జంపా ఊరిస్తూ వేసిన బంతికి స్టయిట్ డ్రైవ్ కొట్టబోయి రిటర్న్ క్యాచ్ ఇచ్చాడు. అంతకుముందు బంతిని సిక్స్ కొట్టిన కోహ్లి.. ఆపై మళ్లీ బంతిని హిట్ చేద్దామనుకునే వికెట్ను సమర్పించుకున్నాడు. దాంతో భారత్ 156 పరుగుల వద్ద నాలుగో వికెట్ను కోల్పోయింది.
మరోవైపు శ్రేయస్ అయ్యర్(4) సైతం నిరాశపరిచాడు. మిచెల్ స్టార్క్ బౌలింగ్లో వికెట్ కీపర్ క్యారీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అవుట్ సైడ్ ఎడ్జ్ తీసుకున్న బంతిని వికెట్ కీపర్ కేరీ సునాయాసంగా అందుకున్నాడు. దీంతో భారత్ కష్టాలు మరింత పెరిగాయి. అయ్యర్ స్థానంలో రవీంద్ర జడేజా క్రీజులోకి వచ్చాడు.
FIFTY!
— BCCI (@BCCI) January 14, 2020
A hard-fought half-century for @SDhawan25 off 66 deliveries. This is his 28th in ODIs.#INDvAUS pic.twitter.com/6COdZJw5QP