ఇంతకీ ఆ రికార్డు ఏంటని అనుకుంటున్నారా?
ఇంతకీ ఆ రికార్డు ఏంటని అనుకుంటున్నారా? తాను ఆడిన తొలి టెస్టులోనే ఇప్పటివరకూ మొత్తం 15 మంది భారత బ్యాట్స్మెన్ సెంచరీలు సాధించగా, ఇందులో ముగ్గురు వరుసగా రెండో టెస్టులోనూ సెంచరీ చేశారు. ఈ జాబితాలో సౌరవ్ గంగూలీ, అజహరుద్దీన్, రోహిత్ శర్మలు ఉన్నారు.
పృథ్వీ షా సెంచరీ నమోదు చేస్తే
భారత్-వెస్టిండిస్ జట్ల మధ్య అక్టోబర్ 12 నుంచి హైదరాబాద్లో జరగనున్న రెండో టెస్టు మ్యాచులోనూ పృథ్వీ షా సెంచరీ నమోదు చేస్తే ఈ ముగ్గురి సరసన నిలుస్తాడు. అజహరుద్దీన్ 1984లో ఇంగ్లాండ్తో జరిగిన సిరీస్లో ఈ రికార్డు నెలకొల్పగా... అనంతరం 1996లో అదే జట్టుతో జరిగిన జరిగిన టెస్టు సిరీస్లో గంగూలీ ఈ రికార్డు సాధించాడు.
వరుసగా రెండు మ్యాచుల్లో సెంచరీలు
ఇక 2013లో వెస్టిండిస్తో కోల్కతాలో జరిగిన తొలి టెస్టు మ్యాచు ద్వారా ఆరంగేట్రం చేసిన రోహిత్ శర్మ ఆ మ్యాచ్లో సెంచరీ సాధించాడు. ఆ తర్వాత ముంబైలో జరిగిన రెండో టెస్టు మ్యాచులోనూ సెంచరీ సాధించి వరుసగా రెండు మ్యాచుల్లో సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో చేరాడు.
రెండో టెస్టులో పృథ్వీ షా సెంచరీ సాధిస్తే
హైదరాబాద్ వేదికగా 12న వెస్టిండిస్తో జరగనున్న రెండో టెస్టులో పృథ్వీ షా సెంచరీ సాధిస్తే ఈ రికార్డును అందుకుంటాడు. ఇదిలా ఉంటే ఆడిన మొదటి టెస్టులోనే సెంచరీ చేసిన పృథ్వీ షా అంతర్జాతీయ క్రికెట్లో ఈ అరుదైన ఘనత సాధించిన 104వ బ్యాట్స్మెన్గా కొనసాగుతున్నాడు.