ఇంగ్లండ్ కూడా 27నే..
ఇంగ్లండ్ జట్టు ఆటగాళ్లు మాత్రం శ్రీలంకతో సిరీస్ తర్వాత కొలంబో నుంచి ఈ నెల 27న ఇక్కడికి వచ్చి నేరుగా హోటల్లోకి ప్రవేశిస్తారు. ఇప్పటికే బయో బబుల్లో ఉన్న వీరు చార్టెడ్ ఫ్లయిట్ ద్వారా రానున్నారు. అయితే శ్రీలంకతో సిరీస్లో ఆడని ముగ్గురు ఇంగ్లండ్ క్రికెటర్లు బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్, రోరీ బర్న్స్ ఆదివారం ఢిల్లీకి చేరుకునే అవకాశం ఉంది. అక్కడే వారికి కోవిడ్-19 టెస్టులు నిర్వహిస్తారు. నెగెటివ్గా తేలితే వారు చెన్నైకి బయల్దేరతారు. అయితే ఇక్కడికి చేరుకున్న తర్వాత కూడా సహచరులతో కలవకుండా ఈ ముగ్గురు ప్రత్యేకంగా క్వారంటైన్లో ఉండాల్సి ఉంది.
సిబ్బంది కూడా క్వారంటైన్..
ఫిబ్రవరి 5 నుంచి, 13 నుంచి ఇక్కడి చిదంబరం స్టేడియంలో తొలి రెండు టెస్టులు జరుగుతాయి. క్రికెటర్లకు సహకారం అందించేందుకు తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ ఏర్పాటు చేస్తున్న లైజన్ మేనేజర్లు, గ్రౌండ్స్మన్, డ్రైవర్ తదితరులు కలిసి సుమారు 15 మంది బయో బబుల్లో ఉంటారు. కొందరు అసోసియేషన్ అధికారులను కూడా బయో బబుల్లో ఉంచాలని ముందుగా భావించినా... నిర్వహణ ఏర్పాట్లకు సమస్య రావచ్చని భావించి ఆ ఆలోచనను పక్కన పెట్టారు. వీరెవరూ మ్యాచ్ రోజుల్లో ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్లకు సమీపంలోకి రాకూడదని గట్టి ఆంక్షలు విధించారు.
నాలుగు టెస్ట్ల షెడ్యూల్..
తొలి టెస్టు: ఫిబ్రవరి 5-9, చిందంబరం స్టేడియం, చెన్నై (ఉదయం 9:30 గంటలకు ప్రారంభం)
రెండో టెస్టు: ఫిబ్రవరి 13-17, చిందంబరం స్టేడియం, చెన్నై(ఉదయం 9.30 గంటలకు)
మూడో టెస్టు(డే/నైట్): ఫిబ్రవరి 24-28, సర్దార్ పటేల్ స్టేడియం, అహ్మదాబాద్(మధ్యాహ్నం 2.30 గంటలకు)
నాలుగో టెస్టు: మార్చి 4-8, సర్దార్ పటేల్ స్టేడియం, అహ్మదాబాద్(ఉదయం 9.30 గంటలకు)
ఐదు టీ20ల షెడ్యూల్
తొలి టీ20: మార్చి 12, సర్దార్ పటేల్ స్టేడియం, రాత్రి 7 గంటలకు
రెండో టీ20: మార్చి 14, సర్దార్ పటేల్ స్టేడియం, రాత్రి 7 గంటలకు
మూడో టీ20: మార్చి 16, సర్దార్ పటేల్ స్టేడియం, రాత్రి 7 గంటలకు
నాలుగో టీ20: మార్చి 18, సర్దార్ పటేల్ స్టేడియం, రాత్రి 7 గంటలకు
ఐదో టీ20: మార్చి 20, సర్దార్ పటేల్ స్టేడియం, రాత్రి 7 గంటలకు
మూడు వన్డేల షెడ్యూల్
తొలి వన్డే: మార్చి 23, ఎంసీఏ, పుణె (మధ్యాహ్నం 1.30 గంటలకు)
రెండో వన్డే: మార్చి 26, ఎంసీఏ, పుణె (మధ్యాహ్నం 1.30 గంటలకు)
మూడో వన్డే: మార్చి 28, ఎంసీఏ, పుణె (మధ్యాహ్నం 1.30 గంటలకు)