సుందర్ విఫలం..
అతను మినహా మిగిలిన బ్యాట్స్మెన్ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. కౌంటీ తరఫున బరిలోకి దిగిన భారత ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ (1) ప్రాక్టీస్ను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. భారత్ 91 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని అందుకుంది. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 306/9తో రెండో రోజు ఆటను కొనసాగించిన భారత్... మరో ఐదు పరుగులు మాత్రమే జోడించి 93 ఓవర్లలో 311 పరుగులకు ఆలౌటైంది. క్రెయిగ్ మిల్స్ నాలుగు వికెట్లు తీశాడు.
కోహ్లీ ప్రాక్టీస్ షురూ..
వెన్ను నొప్పితో వామప్ మ్యాచ్కు దూరంగా ఉన్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. బుధవారం నెట్ ప్రాక్టీస్లో పాల్గొన్నాడు. ఎలాంటి ఇబ్బంది లేకుండా బ్యాటింగ్ చేశాడు. వామప్ మ్యాచ్లో సెకండ్ డే లంచ్ బ్రేక్లో విరాట్ నెట్ సెషన్ జరిగింది. సుదీర్ఘంగా సాగిన ఈ సెషన్లో కెప్టెన్ డిఫెన్స్తో పాటు అటాకింగ్ షాట్స్ను సరిచూసుకున్నాడు. సోమవారం కోహ్లీకి బ్యాక్ పెయిన్ రావడంతో ఫిజియో సలహా మేరకు విశ్రాంతి తీసుకున్నాడు. వైస్ కెప్టెన్ అజింక్యా రహానె ఎడమకాలు హ్యామ్స్ట్రింగ్కు ఇంజెక్షన్ ఇచ్చారు.
సెంచరీ హీరోకు చోటు..
ఆట చివరి రోజు సంచలన ప్రదర్శనలు నమోదైతేనే మ్యాచ్ ఫలితం తేలనుంది. దాదాపు డ్రాగా ముగిసినట్లే. ఇక సెంచరీతో ఆకట్టుకున్నహసీబ్ హమీద్కు ఇంగ్లండ్ జట్టు నుంచి పిలుపు అందింది. భారత్తో జరిగే ఐదు టెస్ట్ల సిరీస్లో తొలి రెండు టెస్ట్లకు ఇంగ్లండ్ వేల్స్ క్రికెట్ బోర్డు 17 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ జట్టులోకి తిరిగి రాగా.. గాయాలతో ఇబ్బంది పడుతున్న జోఫ్రా ఆర్చర్, క్రిస్ వోక్స్ను పరిగణలోకి తీసుకోలేదు.
ఇంగ్లండ్ జట్టు..
జోరూట్(కెప్టెన్), జేమ్స్ అండర్సన్, బెయిర్ స్టో, డామ్ బెస్, క్రిస్ బ్రాడ్, రోరీ బర్న్స్, జాస్ బట్లర్, జాక్ క్రాలే, సామ్ కరన్, హసీబ్ హమీద్, డాన్ లారెన్స్, జాక్ లీచ్, ఒలీ పోప్, రాబిన్సన్, సిబ్లే, బెన్ స్టోక్స్, మార్క్ వుడ్