మయాంక్కు ఇది రెండో హాఫ్ సెంచరీ
ఈ క్రమంలో మయాంక్ 96 బంతుల్లో 6 ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. టెస్టుల్లో మయాంక్కు ఇది రెండో హాఫ్ సెంచరీ. మెల్బౌర్న్లో జరిగిన మూడో టెస్టులోనూ మయాంక్ హఫ్ సెంచరీ చేసి అందర్నీ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. అతడికి సీనియర్ బ్యాట్స్మన్ పుజారా చక్కటి సహకారం అందించాడు. అర్ధ సెంచరీ చేసిన తర్వాత మయాంక్ దూకుడు పెంచాడు. లయన్ బౌలింగ్లో రెండు సిక్సర్లు బాదాడు. చివరికి అతడి బౌలింగ్లోనే మయాంక్(77; 112 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు) అవుటయ్యాడు.
ఫిట్ నెస్ సమస్యలు ఎప్పటినుంచో వేధిస్తున్నాయ్: కోహ్లీ
నిలకడగా ఆడుతోన్న టీమిండియా
ఆసీస్తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా రెండో వికెట్ చేజార్చుకుంది. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని జోరు మీదున్న మయాంక్ను నాథన్ లయన్ ఔట్ చేశాడు. 34వ ఓవర్లో లైయన్ వేసిన బంతిని స్టార్క్ చేతికిచ్చి మయాంక్(77) పెవిలియన్ చేరాడు. 47 ఓవర్లలో టీమిండియా రెండు వికెట్లు చేజార్చుకుని 148 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో కోహ్లీ(15), పూజారా(40)లు ఉన్నారు.
తుది జట్టుకు దూరమైన అశ్విన్, ఉమేశ్లు
అయితే గురువారం ప్రారంభమైన నాలుగో టెస్టులో భారత్ నిలకడగా ఆడుతోంది. నాలుగు టెస్టు మ్యాచ్ల సిరీస్లో భారత్ 2-1 ఆధిక్యంలో ఉంది. భారత బౌలర్లు ఉమేశ్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్లకు తుది జట్టులో స్థానం దక్కలేదు. ఆంధ్ర క్రికెటర్ హనుమ విహారికి తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు