233 పరుగుల విజయ లక్ష్యం
దీంతో ఆతిథ్య జట్టుకు 233 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. దీంతో ఇంగ్లాండే విజయం సాధిస్తుందని అంతా భావించారు. అయితే, బౌలింగ్ బౌలింగ్ దెబ్బకు బెయిర్స్టో డకౌట్ కాగా.. ఓపెన్ విన్స్ (14), కెప్టెన్ మోర్గాన్ (21), జోస్ బట్లర్ (10)లు తక్కువ స్కోర్లకే పెవిలియన్ బాటపట్టారు. ముఖ్యంగా మలింగ ఇంగ్లాండ్ టాపార్డర్ను కోలుకోలేని దెబ్బకొట్టాడు.
లోయర్ ఆర్డర్ పని పట్టిన ధనంజయ డిసిల్వా
ఇక, ధనంజయ డిసిల్వా (3/32) లోయర్ ఆర్డర్ పనిపట్టడంతో ఇంగ్లాండ్ 47 ఓవర్లలో 212 పరుగుల వద్దకే ఆలౌటైంది. దీంతో ఈ మ్యాచ్లో శ్రీలంక 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం మలింగ మాట్లాడుతూ "స్టోక్స్ ఎంత దాటిగా ఆడగలడో మాకు తెలుసు. అప్పటికే అతను వరుస బౌండరీలతో దూకుడుగా ఆడుతున్నాడు" అని అన్నాడు.
స్టాక్బాల్స్ వ్యూహంతో కట్టడి చేశాం
"ఈ నేపథ్యంలో అతన్ని స్టాక్బాల్స్ వ్యూహంతో కట్టడి చేశాం. లూజ్ బంతులు వేయకుండా.. లైన్ అండ్ లెంగ్త్కు బౌన్సర్లతో కూడిన వైవిధ్యమైన బంతులు వేశాం. పరుగులు ఇవ్వకుండా బ్యాట్స్మెన్పై ఒత్తిడి తీసుకురావడమే మా ప్రణాళిక. దాన్ని విజయవంతంగా అమలు చేశాం" అని మలింగ తెలిపాడు.
లంక విజయంలో కీలకపాత్ర
లంక విజయంలో కీలకపాత్ర పోషించిన లసిత్ మలింగపై ప్రశంసల వర్షం కురుస్తోంది. శ్రీలంక మాజీకెప్టెన్ మహేల జయవర్థనే ‘ఇప్పుడు చెప్పండ్రా మలింగా హేటర్స్' అని అన్నాడు. ‘ఓ పుస్తకం కవర్ పేజీ చూసి దానిపై ఓ నిర్ణయానికి రాకుడదూ.. మలింగా నీ బౌలింగ్ అద్భుతం' అంటూ మలింగా షర్ట్లెస్ ఫొటోను జత చేస్తూ ట్వీట్ చేశాడు.