2019 వరల్డ్ కప్కు ఓ ప్రత్యేకత
ఈ వరల్డ్ కప్కు ఓ ప్రత్యేక ఉంది. ఆ ప్రత్యేక ఏంటంటే 2015 వరల్డ్కప్, 2017 ఛాంపియన్స్ ట్రోఫీలోలా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో టీమిండియా తన తొలి మ్యాచ్లో తలపడడం లేదు. టీమిండియా తన తొలి మ్యాచ్లో భాగంగా జూన్ 5న దక్షిణాఫ్రికాతో సౌతాంప్టన్లో తలపడనుంది.

పాకిస్థాన్తో జూన్ 16న ఓల్డ్ ట్రాఫోర్డ్లో
ఇక, జూన్ 16న టీమిండియాతో పాకిస్థాన్ మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫోర్డ్లో తలపడనుంది. భారత్-పాక్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ అభిమానులతో హౌస్ పుల్ అవుతుందని టోర్నీ నిర్వహకులు అంచనా వేస్తున్నారు. ఈ మ్యాచ్కి సంబంధించిన టికెట్లను నాలుగు భాగాలుగా విభజించారు. ప్లాటినమ్, గోల్డ్, సిల్వర్, బ్రాంజ్.

భారత్-పాక్ మ్యాచ్ టికెట్ ధరలివే
ప్లాటినమ్ టికెట్ ఖరీదుని £235గా నిర్ణయించారు. అంటే భారత కరెన్సీ ప్రకారం అక్షరాలు రూ. 21, 833వేలు అన్నమాట. ఇక, బ్రాంజ్ టికెట్ ఖరీదుని £70 ( రూ. 6503)గా నిర్ణయించారు. చిన్నపిల్లలకు ప్రత్యకేమైన ధరలను నిర్ణయించారు. గోల్డ్ సెక్షన్ విభాగంలో చిన్నపిల్లలకు టికెట్ ధరను £30 ( రూ. 2787)గా నిర్ణయించగా, బ్రాంజ్ సెక్షన్ విభాగంలో చిన్న పిల్లలకు £6 (రూ. 557)గా నిర్ణయించారు. ఇక, ఈ మ్యాచ్కి సంబంధించి అత్యధిక టికెట్ ధరను £395 (రూ. 36, 688) ఉండగా, అత్యల్ప ధర £95 (రూ. 8823)గా ఉంది.

1992లో వరల్డ్ కప్లాగా రౌండ్ రాబిన్ పద్ధతిలో
ఇదే వేదికపై ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా మ్యాచ్తోపాటు తొలి సెమీఫైనల్ కూడా జరగనుంది. మరో సెమీఫైనల్ జూలై 14న ఎడ్జ్బాస్టన్లో జరగనుంది. అంతేకాదు ఈ వరల్డ్కప్ మ్యాచ్లను 1992లో వరల్డ్ కప్లాగా రౌండ్ రాబిన్ పద్ధతిలో నిర్వహించనున్నారు. 2019 వరల్డ్ కప్లో భారత షెడ్యూల్ ఇలా ఉంది.


Click it and Unblock the Notifications












