మంగళవారం నుంచి జరిగే సమావేశాల్లో
"టీ20 లీగ్ల నిబంధనలు, ఆటగాళ్లను విడుదల చేయడం గురించి మంగళవారం నుంచి జరిగే సమావేశాల్లో ప్రధానంగా చర్చించాల్సి ఉంది. డాక్యుమెంటేషన్, నిర్వాహకులు, నిధులు సమకూరుస్తోంది ఎవరు? అనే విషయాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఈ లీగ్లకు అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది" అని ఐసీసీ జనరల్ మేనేజర్ జెఫ్ అలార్డిస్ అన్నారు.
ఇకపై నుంచి లీగ్లకు సంబంధించిన నిబంధనలు కఠినతరం
"దీంతో ఇకపై నుంచి లీగ్లకు సంబంధించిన నిబంధనలు కఠినతరం కానున్నాయి. స్వదేశంతో పాటు ఐసీసీ నుంచి నిర్వాహకులు అనుమతి పొందడం తప్పనిసరి" అని ఆయన తెలిపారు. దీంతో పాటు అలాగే ఐసీసీ టెస్ట్ చాంపియన్షిప్ విధి విధానాలు, 2028 ఒలింపిక్స్లో క్రికెట్ ప్రవేశపెట్టడం, తదితర అంశాలపైనా చర్చించనున్నట్లు తెలిపారు.
2,028 ఒలింపిక్స్లో క్రికెట్ను చేర్చడంపై కూడా చర్చ
"2019 ప్రపంచకప్ ముగిసిన తర్వాత ప్రారంభం కానున్న వన్డే, టెస్టు ఛాంపియన్ షిప్ల మౌలిక రూపం, పాయింట్ల కేటాయింపు గురించి చర్చించాల్సి ఉంది. దాంతో పాటు 2,028 ఒలింపిక్స్లో క్రికెట్ను చేర్చడంపై చర్చిస్తారు. ఈ విషయంపై గత సమావేశంలోనూ మాట్లాడారు" అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.
తొలిసారి ఐసీసీ స్వతంత్ర మహిళా డైరెక్టర్ స్థానంలో
పెప్సీకో మాజీ సీఈవో ఇంద్రానూయి తొలిసారి ఐసీసీ స్వతంత్ర మహిళా డైరెక్టర్ స్థానంలో ఈ సమావేశాలకు హాజరవుతున్నారు. ఇదిలా ఉంటే, లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న బీసీసీఐ సీఈవో రాహుల్ జోహ్రీని అంతర్జాతీ య క్రికెట్ మండలి (ఐసీసీ) భేటీకి హాజరు కావొద్దని బీసీసీఐ పాలకుల కమిటీ చీఫ్ వినోద్ రాయ్ ఆదేశించారు. దాంతో జోహ్రీ స్థానంలో బోర్డు తాత్కాలిక కార్యదర్శి అమితాబ్ చౌధురి భారత ప్రతినిధిగా ఆ సమావేశాలకు హాజరుకానున్నారు.