2019, 2020 నుంచి ఈ టెస్టు, వన్డే లీగ్స్ ప్రారంభం
2019, 2020 నుంచి ఈ టెస్టు, వన్డే లీగ్స్ ప్రారంభమవుతాయని ఆయన తెలిపారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ని ఐసీసీ మరికొన్ని రోజుల్లో ఆధికారికంగా ప్రకటిస్తుంది. ఇక నాలుగు రోజుల టెస్ట్ క్రికెట్ను ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు సభ్య దేశాలకు ఐసీసీ అనుమతినిచ్చింది. ఆయా క్రికెట్ బోర్డులు పరస్పర అంగీకారంతో ఈ నాలుగు రోజుల టెస్ట్లను నిర్వహించుకోవచ్చని తెలిపింది.
డేనైట్ టెస్ట్లను ఎలా నిర్వహిస్తున్నారో అలాగే
ఇందుకు సంబంధించిన నిబంధలను ఖరారు చేసే పనిలో ఐసీసీ ఉంది. డేనైట్ టెస్ట్లను ఎలా నిర్వహిస్తున్నారో అలాగే వీటిని కూడా ఆయా బోర్డులు నిర్వహించుకోవచ్చని ఐసీసీ స్పష్టం చేసింది. ఈ ఏడాది చివర్లో బాక్సింగ్ డే టెస్టులో భాగంగా దక్షిణాఫ్రికా-జింబాబ్వే దేశాల మధ్య ఈ తరహా టెస్టు మ్యాచే జరగనుంది. ఇక 2019 వరల్డ్కప్ క్వాలిఫయర్స్ వచ్చే ఏడాది మార్చిలో జింబాబ్వేలో నిర్వహించాలని ఐసీసీ నిర్ణయించింది.
9 జట్లు రెండేళ్లలో ఆరు సిరీస్లు
'టెస్టు ఛాంపియన్షిప్లో భాగంగా 9 జట్లు రెండేళ్లలో ఆరు సిరీస్లు ఆడతాయి. మూడు ఇంట, మూడు బయట. ఈ సిరీస్లు కనీసం రెండు నుంచి గరిష్ఠంగా ఐదు టెస్ట్ల వరకు ఉంటాయి. చివరగా టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ జరుగుతుంది. ఇక వన్డే లీగ్లో 13 జట్లు పాల్గొంటాయి' అని ఐసీసీ సీఈఓ డేవ్ రిచర్డ్సన్ తెలిపారు. తొలి ఎడిషన్లో భాగంగా ప్రతి జట్టు నాలుగు సొంతగడ్డపై, నాలుగు విదేశీ సిరీస్లు ఆడాల్సి ఉంటుంది.
ప్రతి సిరీస్లో మూడు వన్డేలు
ప్రతి సిరీస్లో మూడు వన్డేలు ఉంటాయి. ఈ టెస్టు, వన్డే లీగ్స్ ఒప్పందం కుదుర్చుకున్న అన్ని సభ్య దేశాలకు ఈ సందర్భంగా ఐసీసీ చైర్మన్ శశాంక్ మనోహర్ శుభాకాంక్షలు తెలిపారు. ద్వైపాక్షిక సిరీస్ల ప్రాధాన్యత పెరగడానికి ఇదే అత్యుత్తమ పరిష్కారం అని ఆయన అన్నారు. రెండేళ్ల పాటు దీనిపై చర్చలు నడిచినట్లు ఐసీసీ సీఈవో డేవ్ రిచర్డ్సన్ వెల్లడించారు.