బీసీసీఐ చీఫ్గా గంగూలీ ఏకగ్రీవం.. 23న బాధ్యతల స్వీకరణ!!
నిబంధనలకు విరుద్ధంగా బోర్డు ఎన్నికల్లో నేపాల్ ప్రభుత్వం కలుగజేసుకుందని ఆ దేశ బోర్డును 2016లోనే ఐసీసీ బ్యాన్ చేసింది. తాజాగా ఇరు దేశాలపై నిషేధం ఎత్తివేయడంతో ఆ దేశ ఆటగాలు హర్షం వ్యక్తం చేశారు. నిషేధం అనంతరం జింబాబ్వే ట్రై సిరీస్ ఆడింది. అయితే ఆ సిరీస్కు ఐసీసీ అనుమతి ఇచ్చింది. ఇక వచ్చే ఏడాది జనవరిలో జరిగే అండర్-19 ప్రపంచకప్లో జింబాబ్వే పాల్గొననుంది. మరోవైపు నేపాల్ కూడా ద్వైపాక్షిక సిరీస్లలో పాల్గొననుంది.
బోర్డు మీటింగ్లో ఐసీసీ మహిళల క్రికెట్ టోర్నీల ప్రైజ్మనీని భారీగా పెంచుతూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది. 2018తో పోలిస్తే 2020 టీ20 ప్రపంచకప్ ప్రైజ్మనీని ఐదు రెట్లు పెంచింది. టీ20 ప్రపంచకప్ విజేతకు దాదాపు రూ. 7.12కోట్లు ఇవ్వనుంది. ఇక రన్నరప్కు దాదాపు రూ.3.56కోట్లు దక్కనుంది. 2021 వన్డే ప్రపంచకప్ కోసం మొత్తం 24 కోట్లను కేటాయించనుంది. తొలిసారిగా అండర్-19 మహిళల ప్రపంచకప్ను 2021 నుంచి ప్రతి రెండేళ్లకు ఒకసారి నిర్వహించాలని నిర్ణయించింది.
ప్రపంచకప్ సెమీస్, పైనల్లో సూపర్ ఓవర్ కూడా టై అయితే బౌండరీ లెక్కతో విజేతను నిర్ణయించకుండా.. ఫలితం వచ్చే వరకు సూపర్ ఓవర్లు ఆడిస్తామని ఐసీసీ స్పష్టం చేసింది. ఇటీవల ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య జరిగిన ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ సూపర్ ఓవర్ కూడా టైగా మారడంతో.. బౌండరీల లెక్కతో ఇంగ్లండ్ను విజేతగా ప్రకటించారు. ఇది సర్వత్రా విమర్శలకు దారితీసింది. దీంతో ఇక నుంచి సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్ల్లో సూపర్ ఓవర్ టై అయితే ఫలితం తేలేవరకు సూపర్ ఓవర్లు ఉంటాయి. కేవలం నాకౌట్ దశలోనే ఆడించే సూపర్ ఓవర్లను ఇకపై లీగ్ దశలోనూ ఆడిస్తారు. అయితే ఆ సూపర్ ఓవర్ టై అయితే మ్యాచ్ను టైగా పరిగణిస్తారు.