న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

విలియమ్సన్‌ గొప్ప క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాడు!!

ICC Cricket World Cup 2019: Ravi Shastri Lauds New Zealand Captain Kane Williamsons Composure After Controversial World Cup Final Loss

ప్రపంచకప్‌ ఫైనల్ మ్యాచ్ అనంతరం న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ గొప్ప క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాడు అని టీమిండియా ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి ప్రశంసలు కురిపించాడు. లార్డ్స్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ చివరి వరకు పోరాడి ఓడిపోయిన విషయం తెలిసిందే. బౌండరీల ఆధారంగా విజేతను ప్రకటించినా విలియమ్సన్‌ మాత్రం ఎలాంటి విమర్శలు చేయలేదు.

నీ సహనం, ప్రశాంతత గొప్పవి:

తాజాగా రవిశాస్త్రి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ... 'ఇలాంటి సమయంలో కూడా నువ్వు చూపిన సహనం, ప్రశాంతత గొప్పవి. ఫైనల్ మ్యాచ్‌ తర్వాత 48 గంటల పాటు నువ్వు పాటించిన మౌనం అద్భుతం. ప్రపంచకప్‌ టైటిల్‌ చేజారినప్పటికీ మీరు కూడా విజేతలే. నువ్వు సమర్థుడైన ఆటగాడివి. దేవుడి ఆశీర్వాదం నీకు ఉంటుంది' అంటూ రవిశాస్త్రి పేర్కొన్నాడు.

ఆగ్రహించలేదు:

ఆగ్రహించలేదు:

మ్యాచ్ అనంతరం బౌండరీ నిబంధన ప్రకారం ఫలితం రావడం జీర్ణించుకోలేకపోతున్నామని నిరాశ వ్యక్తం చేశాడు తప్ప ఆగ్రహించలేదు. మ్యాచ్‌ బాగా జరిగిందని, అందరూ బాగా ఆస్వాదించారని పేర్కొన్నాడు. ఫలితం అనుకూలంగా రాకపోయినా.. ఎవరిపైనా విమర్శలు చేయకుండా తన క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాడు. దీంతో రవిశాస్త్రి ప్రశంసలు కురిపించాడు.

 అంపైర్ల నిర్ణయాన్ని అంగీకరించాం:

అంపైర్ల నిర్ణయాన్ని అంగీకరించాం:

వివాదాస్పద ఆరు పరుగుల ఓవర్‌ త్రోపై విలియమ్సన్‌ మాట్లాడుతూ... 'మ్యాచ్‌ ఆఖరి క్షణాల్లో అంపైర్లు చేసిన పొరపాటును తెలుసుకుని ఆశ్చర్యపోయాం. నిబంధనలపై సంపూర్తి అవగాహన లేని మేం ఆ సమయంలో అంపైర్ల నిర్ణయాన్ని అంగీకరించాం. వందలకొద్దీ ఉన్న ఇతర నిబంధనల్లానే ఇదీ ఒకటని భావించాం. అంతే తప్ప భిన్నమైనదని అనుకోలేదు' అని తెలిపారు.

సూపర్ ఓవర్‌:

సూపర్ ఓవర్‌:

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 241 పరుగులు చేసింది. అనంతరం 242 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ కూడా నిర్ణీత 50 ఓవర్లలో 241 పరుగులే చేయడంతో మ్యాచ్ టైగా ముగిసింది. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారితీసింది. సూపర్ ఓవర్‌ కూడా టై కావడంతో.. మ్యాచ్‌లో అత్యధిక బౌండరీలు బాదిన ఇంగ్లాండ్ జట్టు విజేతగా నిలిచింది.

Story first published: Wednesday, July 17, 2019, 13:57 [IST]
Other articles published on Jul 17, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X