రోహిత్, కోహ్లీ ప్రధాన బలం:
సెమీస్లో స్థానం ఖాయమైనప్పటికీ ఈ మ్యాచ్ భారత్కు ముఖ్యమైనదే. ఎవరికైనా విశ్రాంతిని ఇవ్వాలన్నా.. బెంచ్ ఆటగాళ్లను ఆడించాలన్నా.. ఎవరైనా కుదురుకోవాలన్నా ఈ మ్యాచ్తో జరిగిపోవాలి. ఓపెనర్ రోహిత్ శర్మ జట్టు ప్రధాన బలం. కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్కు వెన్నెముక. ఇద్దరు పరుగులు చేస్తుండంతోనే భారత్ విజయాలు సాధిస్తోంది. మోస్తరుగా రాణిస్తున్న ఓపెనర్ రాహుల్ స్థానానికి వచ్చిన ప్రమాదమేమీ లేదు.
మిడిల్ ఆర్డర్ సమస్య:
టోర్నీలో ఎనిమిది మ్యాచ్లు ఆడినా.. మిడిల్ ఆర్డర్ మాత్రం గాడిన పడలేదు. మిడిల్ ఆర్డర్ గాడినపడేందుకు ఈ మ్యాచ్ మంచి అవకాశం. నాలుగో స్థానంలో రెండు చెప్పుకోదగ్గ స్కోర్లు సాధించిన పంత్ చోటు ఖాయం చేసుకున్నాడు. బంగ్లాదేశ్తో మ్యాచ్లో దినేశ్ కార్తీక్ విఫలం కాగా.. ఆడింది ఒకే మ్యాచ్ కాబట్టి కార్తీక్కు మరో అవకాశం దక్కవచ్చు. ఇక మాజీ కెప్టెన్ ధోనీ స్లో బ్యాటింగ్ కలవరపెడుతోంది. సెమీస్ ముందు గాడిలో పడితే మంచిది. పాండ్యా ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నాడు.
భువీ, షమీలలో ఒక్కరే:
పిచ్ స్పిన్కు అనుకూలించే అవకాశమున్నందున భారత్ ఇద్దరు స్పిన్నర్లు చాహల్, కుల్దీప్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది. దీంతో పేసర్లు భువనేశ్వర్, షమీలలో ఒక్కరే జట్టులో ఉండొచ్చు. షమీ వికెట్లు తీస్తున్నా.. ధారాళంగా పరుగులు ఇస్తున్న నేపథ్యంలో భువీ జట్టులో ఉండనున్నాడు. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా మరోసారి పరుగుల ప్రవాహంను ఆడ్డుకోనున్నాడు. అయితే జట్టులో ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాని రవీంద్ర జడేజాను కూడా బరిలోకి దించాలని మేనేజ్మెంట్ ఆలోచిస్తోంది.
బౌలింగే బలం:
గత మ్యాచ్లో సెంచరీతో చెలరేగిన యువ ఆటగాడు అవిష్క ఫెర్నాండో మరోసారి చెలరేగనున్నాడు. కెప్టెన్ దిముత్ కరుణరత్నే భారీ ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. కుషాల్ మెండీస్, కుషాల్ పెరీరా, మాథ్యూస్ కూడా రాణిస్తే లంక భారీ స్కోరు చేయగలదు. బ్యాటింగ్తో పోల్చుకుంటే లంక బౌలింగే బలంగా ఉంది. పేసర్ లసిత్ మలింగ అవకాశాలు లేని చోటు నుంచి కూడా జట్టుకు విజయాల బాట వేస్తున్నాడు. మలింగ, ఉడానా, రజిత, ధనంజయలతో బౌలింగ్ ఉంది. అయితే వీరు భారత బ్యాట్స్మెన్ను ఎలా అడ్డుకుంటుందో చూడాలి.
ముఖాముఖి రికార్డు:
భారత్, శ్రీలంక జట్లు ఇప్పటివరకు 158 మ్యాచ్లు ఆడాయి. 90 మ్యాచ్ల్లో భారత్.. 56 మ్యాచ్ల్లో శ్రీలంక గెలిచాయి. ఒక మ్యాచ్ ‘టై' అయింది. ఇక 11 మ్యాచ్లు రద్దయ్యాయి. మరోవైపు ప్రపంచకప్లో ఈ రెండు జట్ల మధ్య 8 మ్యాచ్లు జరిగాయి. 3 మ్యాచ్ల్లో భారత్.. 4 మ్యాచ్ల్లో శ్రీలంక నెగ్గాయి. మరో మ్యాచ్ రద్దయింది. లీడ్స్ బ్యాటింగ్ పిచ్. భారీ స్కోర్లకు అవకాశం ఉంది. కొంత వరకు స్పిన్కు అనుకూలించవచ్చు. మ్యాచ్కు వర్షం ముప్పు లేదు.
తుది జట్లు (అంచనా):
భారత్: రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), రిషబ్ పంత్, ఎంఎస్ ధోనీ, దినేష్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, మొహ్మద్ షమీ /భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చహల్, జస్ప్రీత్ బుమ్రా.
శ్రీలంక: దిముత్ కరుణరత్నే (కెప్టెన్), కుశాల్ పెరీరా, అవిష్క ఫెర్నాండో, కుశాల్ మెండిస్, ఏంజిలో మాథ్యూస్, తిసార పెరీరా, ధనంజయ డిసిల్వా, ఉరుసు ఉదాన, లసిత్ మలింగ, కాసున్ రజిత, జెఫ్రీ వాండర్సే.