సానియాకు అండగా:
మ్యాచ్కు ముందురోజు రాత్రి తన భార్య సానియా మిర్జాతో కలిసి షోయబ్ మాలిక్ డిన్నర్కు వెళ్లాడని, అందుకే పాకిస్థాన్ మ్యాచ్ ఓడిపోయిందని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. దీనిపై సెహ్వాగ్, అక్తర్లు స్పందించారు. షోయబ్ అక్తర్ యూట్యూబ్ ఛానెల్లో ఈ ఇద్దరు మాజీ ఆటగాళ్లు మాట్లాడి సానియాకు అండగా నిలిచారు.
తప్పేముంది:
'పాకిస్థాన్ ఓటమికి సానియానే కారణమని అభిమానులు చేస్తున్న ఆరోపణలు సరైనవి కావు. అలాంటి ఆరోపణలు ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు. మాలిక్ తన భర్త. భోజనం చేసేందుకు కలిసి బయటకు వెళ్లారు. అందులో తప్పేముంది. మ్యాచ్ ఉంటే భోజనం కూడా చేయోద్దా?. అసలు పాక్ ఓటమికి సానియాకు ఏమైనా సంబంధం ఉందా' అని అక్తర్ ప్రశ్నించాడు.
ఆ హక్కు ఎవరికీ లేదు:
సెహ్వాగ్ మాట్లాడుతూ... 'ఆటగాళ్ల వ్యక్తిగత విషయాలపై ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు. వ్యక్తిగత జీవితాన్ని, క్రికెట్ కెరీర్కు ముడిపెట్టడం సరికాదు. గతంలో విరాట్ కోహ్లీ ,అనుష్క శర్మల విషయంలోనూ ఇదే చెప్పా. అభిమానులు ఆటగాళ్ల కుటుంబ సభ్యులను నిందించడం మంచి పద్దతి కాదు. మాలిక్, సానియా ఎక్కడికెళ్లారు? ఏం తిన్నారు? అనేది వాళ్ల వ్యక్తిగతం. మ్యాచ్ సందర్భంగా మాలిక్ సన్నద్ధమవ్వాలి. సానియాకు ఎలాంటి సంబంధం లేదు' అని సెహ్వాగ్ పేర్కొన్నారు.
బర్గర్లు తింటే తప్పేంటి:
ఈ విమర్శలపై హర్భజన్ సింగ్ కూడా ఇదివరకే స్పందించారు. 'క్రికెట్ ఆటగాళ్లు ఇష్టమైన ఆహారన్ని తినొచ్చు. పిజ్జాలు, బర్గర్లు తింటే తప్పేంటి. పాక్ ఆటగాళ్ల చెత్త ప్రదర్శనకు వారి ఆహారమే కారణమని చెప్పడం సరికాదు. మ్యాచ్ ముందు రోజు భోజనం చేయకుండా షికారు చేయడం మాత్రం సరైంది కాదు. ఇక ప్రపంచకప్లో భారత్తో మ్యాచ్ అయితే ఇంకా జాగ్రత్తగా ఉండాలి' అని హర్భజన్ అబిప్రాయపడ్డారు.