భారత్ ఇన్నింగ్స్ సాఫీగా సాగుతున్న సమయంలో వరుణుడు ఆడ్డుపడ్డాడు. ప్రస్తుతం మైదానంలో చిరుజల్లులు కురుస్తున్నాయి. దీంతో మ్యాచ్ను అంపైర్లు తాత్కాలికంగా నిలిపేశారు. మ్యాచ్ నిలిచిపోయే సమయానికి భారత్ 46.4 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 305 పరుగులు చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ (71), విజయ్ శంకర్ (3) క్రీజులో ఉన్నారు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
మైదానంలో వర్షం ఎక్కువైంది. చిరుజల్లులుగా మొదలైన వర్షం ఇప్పుడు భారీగా కురుస్తోంది. మైదాన సిబ్బంది పిచ్ను కవర్లతో కప్పి ఉంచారు. ఓవర్లకు కుదించడానికి ముందు 75 నిమిషాల సమయం ఉంటుంది. వర్షం తీవ్రతపై మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంది. ఓవర్లను కుదించినా.. మనకు మెరుగైన రన్ రేట్ ఉంది కనుక పాక్ జట్టుకు భారీ లక్ష్యమే ముందు ఉంటుంది.
Waiting for the rain to stop like...#INDvPAK | #CWC19 pic.twitter.com/Lu54zT6U6b
— Cricket World Cup (@cricketworldcup) June 16, 2019
ప్రపంచకప్లో దక్షిణాఫ్రికా,ఆస్ట్రేలియా జట్లపై అదరగొట్టిన టీమిండియా టాపార్డర్ బ్యాట్స్మెన్ మళ్లీ మెరిశారు. పాక్ బౌలర్లను ఆటాడుకుంటూ వీరవిహారం చేశారు. ముఖ్యంగా 'హిట్మ్యాన్' రోహిత్ శర్మ అద్భుత సెంచరీ (140 113 బంతుల్లో 14ఫోర్లు, 3సిక్సర్లు)తో టీమిండియాకు భారీ స్కోరు అందించాడు. లోకేశ్ రాహుల్ (57 78 బంతుల్లో 3ఫోర్లు, 2సిక్సర్లు) అర్ధ శతకంతో విజృంభించాడు. ఇక కెప్టెన్ విరాట్ కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. హార్దిక్ పాండ్య (26 19 బంతుల్లో 2ఫోర్లు, సిక్స్) ఉన్నంతసేపు రెచ్చిపోయాడు. ధోనీ (1) మాత్రం నిరాశపరిచాడు.
{headtohead_cricket_3_5}
That's a shame.
— Cricket World Cup (@cricketworldcup) June 16, 2019
Rain comes down in Manchester with 20 deliveries left in the India innings.#CWC19 | #INDvPAK pic.twitter.com/XgerntsRdy