|
మొత్తం మ్యాచ్ జరిగేలా లేదు:
ఈ రోజు మొత్తం నాటింగ్హామ్లో వర్షం కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. మంగళ, బుధవారం లాగే మ్యాచ్ సమయానికి వర్షం కురిసే అవకాశం ఉందట. ఒకవేళ మ్యాచ్ సమయానికి వర్ధం పడుకున్నా.. మ్యాచ్ సాగుతున్నా కొద్ది పడే అవకాశం ఉందట. దీంతో 50 ఓవర్ల మ్యాచ్ మొత్తం జరిగేలా లేదు. ఇక టీమిండియా ప్రాక్టీస్ సెషన్కి కూడా వర్షం అడ్డంకిగా మారింది. అయితే మ్యాచ్కు ఇంకా రెండు గంటల సమయం ఉంది కాబట్టి ఏదైనా జరగొచ్చు.
న్యూజిలాండ్కే లాభం:
ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దైతే చెరో పాయింట్ లభిస్తుంది. ఇది న్యూజిలాండ్కే లాభం. ఎందుకంటే న్యూజిలాండ్ ఇప్పటికే మూడు విజయాలతో ఆరు పాయింట్లు సాధించి అగ్రస్థానంలో కొనసాగుతోంది. కివీస్ ఏడు పాయింట్లు సాధిస్తే సెమీస్కు చేరుకునే అవకాశాలు ఎక్కువవుతాయి. ఇక మిగిలిన ఐదింటిలో మూడు గెలిచినా.. సెమీస్లో తొలి రెండు స్థానాల్లో ఏదో ఒకటి సొంతం చేసుకుంటుంది.
రిజర్వ్ డే అసాధ్యం:
ప్రపంచకప్లో ఇప్పటికే మూడు మ్యాచ్లు వర్షం కారణంగా రద్దయ్యాయి. పాకిస్థాన్, శ్రీలంక.. దక్షిణాఫ్రికా, వెస్టిండీస్.. బంగ్లాదేశ్, శ్రీలంక మ్యాచ్లు వర్షార్పణమయ్యాయి. మరికొన్ని మ్యాచ్లకు కూడా వర్షం ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ నేపథ్యంలో ఐసీసీ టోర్నీ నిర్వహణ తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రతిష్టాత్మక టోర్నీలో అన్ని మ్యాచ్లకు 'రిజర్వ్ డే' ఉంటే బాగుండేదని చాలా మంది అభిప్రాయపడ్డారు. అయితే ప్రపంచకప్లో ప్రతీ మ్యాచ్కు రిజర్వ్ డే పెట్టడం అసాధ్యం. రిజర్వ్ డే రోజున కూడా వర్షం పడదని ఎవరూ హామీ ఇవ్వలేరు' అని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తెలిపింది.