
శంకర్కి అవకాశం :
నాలుగో స్థానంలో టీమిండియా ఎందరినో పరీక్షించి చివరకు అంబటి రాయుడుకు ఫిక్స్ అయింది. 2019 జనవరి వరకు రాయుడిని టీమిండియాలో నాలుగో స్థానంలో ఆడించారు. కేవలం ఆస్ట్రేలియా, ఐపీఎల్-12లో సరిగా ఆడనందుకు ప్రపంచకప్ జట్టులో చోటు కల్పించలేదు. అతని స్థానంలో విజయ్ శంకర్కి సెలక్టర్లు అవకాశం ఇచ్చారు. విజయ్ శంకర్ బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ ఇలా మూడు విభాగాల్లో (త్రీ డైమన్షన్స్) జట్టుకి ఉపయోగపడతాడని ఎమ్మెస్కే ప్రసాద్ వివరణ ఇచ్చారు.

రెండు సార్లు నిరాశే:
రాయుడుని ఎంపిక చేయకపోవడంతో సెలెక్టర్లపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో చివరకు రాయుడిని స్టాండ్బైగా ప్రకటించారు. ఓపెనర్ శిఖర్ ధావన్, విజయ్ శంకర్ గాయపడితే రిషబ్ పంత్, మయాంక్ అగర్వాల్ను జట్టులోకి తీసుకున్నారు. రాయుడికి రెండు సార్లు నిరాశే ఎదురైంది. తీవ్ర మనస్తాపానికి గురైన రాయుడు ప్రపంచకప్ టోర్నీ జరుగుతుండగానే క్రికెట్కు వీడ్కోలు పలికాడు. రాయుడి రిటైర్మెంట్కు త్రీడీ ట్వీట్ కూడా ఓ కారణమేనని వార్తలు వచ్చాయి.

స్టాండ్బైకే అవకాశం:
ఈ వివాదం ప్రపంచకప్ జట్టును ప్రకటించినప్పటి నుండి జరుగుతూనే ఉంది. ఎందరో మాజీలు స్పందించారు. టోర్నీ అయిపోయి దాదాపు రెండు వారాలు కావొస్తోంది. ఇప్పుడు అజాహరుద్దీన్ స్పందించారు. 'స్టాండ్బైగా ఎంపికయిన ఆటగాడు జట్టులో ఎవరైనా గాయపడితే అతడి స్థానంలో వెళ్లాల్సి ఉంటుంది. కచ్చితంగా స్టాండ్బైకే అవకాశం ఇవ్వాలి. కోచ్, కెప్టెన్ నిర్ణయాన్ని సెలక్టర్లు వ్యతిరేకించవచ్చు, మేము అతన్నే పంపిస్తాం అని చెప్పొచ్చు' అని అజాహరుద్దీన్ అన్నారు.

వివరణను అంగీకరించను:
'నేను కెప్టెన్గా ఉన్నప్పుడు కొంత మంది ఆటగాళ్లు కావాలని సెలెక్టర్లను అడిగాను. కానీ అందుకు వారు ఒప్పుకోలేదు. అప్పుడు సెలక్టర్లు అలా వ్యవహరించారు. ఇపుడు రాయుడుని ఎంపిక చేయకపోవడం ఎంతో బాధాకరం. మొత్తానికి అలా జరిగిపోయింది. ఏదేమైనా ఎమ్మెస్కే వివరణను నేను అంగీకరించను' అని అజహరుద్దీన్ పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications












